దీన్ని వ్యతిరేకిస్తూ సైఫ్ అలీ ఖాన్ హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. తమ ప్రాపర్టీగా ఆయన చెబుతున్నారు, కానీ ఈ పిటిషన్ని హైకోర్ట్ కొట్టేసింది.
అక్కడ ఉన్నది ఎనిమీ ప్రాపర్టీనే అని, దీనిపై మరోసారి పూర్తిగా విచారణ జరిపించాలని, అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్ట్ ఆదేశించింది.
దీంతో ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన నిర్ణయం ప్రభుత్వం చేతిలో ఉంది. వారి నిర్ణయం ప్రకారం దీన్ని ఎనిమీ ప్రాపర్టీగానే ప్రకటించే అవకాశం ఉంది.
ఇదే జరిగితే ఈ ఆస్తిని సైఫ్ కోల్పోవల్సి వస్తుంది. ఇక దేశ విభజన సమయంలో సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులు కొందరు పాకిస్తాన్ వెళ్లిపోయారు. వారికి సరైన వారసులు లేరని, దీంతో ఆ ఆస్తిని ఎనిమీ ప్రాపర్టీగా ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.