మానసిక ప్రశాంతత కోసం అలా చేస్తా.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న సాయిపల్లవి.. పిక్స్

First Published Jun 10, 2023, 12:57 PM IST

ముక్కుసూటిగా మాట్లాడే హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు. తెలుగు ప్రేక్షకులకు తక్కువ సమయంలో దగ్గరైంది. అయితే, తాజాగా తన ప్రొఫెషన్ గురించి నేచురల్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
 

యంగ్ హీరోయిన్ సాయి పల్లవి తెలుగులో తక్కువ సినిమాలే చేసినా ప్రేక్షకులకు మాత్రం చాలా దగ్గరైంది. తను చేసిన సినిమాల్లోని పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ కు గుర్తుండిపోయేలా చేసింది. నటిగా ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 
 

డాన్సర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న సాయి పల్లవి ‘కస్తూరి మాన్’ చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయం అయ్యింది. మలయాళంలో వచ్చిన ‘ప్రేమమ్’ చిత్రానికిగానూ సాయి పల్లవికి మంచి ఫేమ్ దక్కింది. అప్పటి వరకు తమిళం, మలయాళంలో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోకీ ఎంట్రీ ఇచ్చింది. 
 


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ‘ఫిదా’లో నటించి ప్రేక్షకులను అలరించింది. నేచురల్ యాక్టింగ్ తో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. తనదైన నటనతో మెప్పించింది. దాంతో అప్పట్లో సెన్సేషనల్ గా మారింది. దీంతో తెలుగులో వరుసగా ఆఫర్లు అందుకుంది. తమిళం, మలయాళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ వస్తోంది.
 

ఇదిలా ఉంటే.. ఇటీవల సాయిపల్లి ఆయా ఇంటర్వ్యూల్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తన వ్యక్తిత్వాన్ని రిప్రజెంట్ చేసేలా మాట్లాడుతూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తన ప్రొఫెషన్, పర్సనల్ లైఫ్ పై ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్  చేశారు. 
 

సాయి పల్లవి మాట్లాడుతూ.. తన వృతిని ఎప్పుడూ ఆస్వాదిస్తూ ఉంటానని, మన ప్రొఫెషన్ ను ఇష్టంగా చేయాలని చెప్పింది. పనిలో సంతోషాన్ని వెతుక్కోవాలంటూ సూచించింది. అప్పుడే వృతి పరంగా తృప్తి కలుగుతుందన్నారు. అలాగే తన వ్యక్తిగత జీవితాన్ని, వృతిని ఎప్పుడూ ఒకటిగా చూడనని చెప్పారు. వృతిని జీవితంలోకి అస్సలు తీసుకురానన్నారు. దాంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటానని చెప్పుకొచ్చారు. 
 

సెట్ లో అడుగుపెట్టాక తన వ్యక్తిగత జీవితాన్ని మరిచిపోతానని,  సెట్స్ నుంచి బయటికి వచ్చాక వృత్తి గురించి ఆలోచించనని చెప్పారు. అందుకే సాయిపల్లవి ఎప్పుడూ కూల్ గా, కాన్ఫిడెంట్ గా కనిపించేందుకు దోహదపడుతుందని అర్థమవుతోంది. గతేడాది ‘విరాట పర్వం’, ‘గార్గి’ చిత్రాలతో అలరించిన సాయి పల్లవి ప్రస్తుతం శివ కార్తీకేయన్ 21లో నటిస్తోంది. ఇక తాజాగా వెకేషన్ లో ఈ ముద్దుగ్మమ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ దర్శనమిచ్చింది. కొన్ని ఫొటోలను కూడా పంచుకుంది. 

click me!