డాన్స్‌ స్టూడెంట్‌గా సాయిపల్లవి, గెస్ట్ గా సమంత.. హంసలా డాన్స్ చేస్తున్నావంటూ లేడీ పవర్‌ స్టార్‌ కి ప్రశంసలు

First Published Mar 29, 2024, 7:13 PM IST

ప్రస్తుతం సమంత,సాయిపల్లవి టాలీవుడ్‌లోనే కాదు సౌత్‌లోనూ స్టార్‌ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం సాయిపల్లవి స్టూడెంట్‌గా, సమంత గెస్ట్ గా కలవడం ఆశ్చర్యపరుస్తుంది. 

లేడీ పవర్‌ స్టార్‌ గా రాణిస్తుంది సాయిపల్లవి. టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లలో ఒకరు. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేయకపోయినా, ఆమె రేంజ్‌ మాత్రం వేరే లెవల్‌. ఆమె క్రేజ్‌ మరో స్థాయిలో ఉంటుందని చెప్పొచ్చు. మరోవైపు సమంత స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. లేడీ సూపర్‌ స్టార్‌ క్రేజ్‌ని దగ్గరలో ఉంది. ఎవరికి వారు తక్కువ కాదని చెప్పొచ్చు. 
 

ఇదిలా ఉంటే ఈ ఇద్దరు ఓ షోలో కలుసుకున్నారు. అప్పుడు సమంత హీరోయిన్‌. కానీ సాయిపల్లవి కాదు. ఆమె డాన్సర్‌గా నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉంది. ప్రారంభంలో సాయిపల్లవి ఢీ షోలో పాల్గొంది. డాన్సింగ్‌ కంటెస్టెంట్‌గా మెరిసింది. ఉదయభాను దీనికి యాంకర్‌గా ఉంది. అప్పట్లో ఈ షో ఎంతో మంది డాన్సర్లని, కొరియోగ్రాఫర్లని వెలికి తీసింది. అలా వచ్చిందే సాయిపల్లవి కూడా. 
 

అయితే ఈ డాన్స్ షోకి ఓ సారి సమంత గెస్ట్ గా వచ్చింది. ఆమె `ఏం మాయ చేసావె` సినిమా చేసి మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. హీరోయిన్‌గా యంగ్‌ సెన్సేషన్‌గా మారింది. దీంతో ఆమెని గెస్ట్ గా ఆహ్వానించారు. ఈ షోలో సాయిపల్లవి కూడా ఉంది. ఆమె డాన్స్ ప్రదర్శించింది. ఈ సందర్భంగా సాయిపల్లవి చేసిన డాన్స్ కి ఫిదా అయ్యింది సమంత. ఆ హ్యాపీనెస్‌ని వ్యక్తం చేసింది. 
 

సాయిపల్లవి డాన్స్ ని చూసి ఆమె మాట్లాడుతూ, మీ డాన్సుని చూస్తూ కళ్లు తిప్పుకోలేకపోయాను. డాన్స్ మూమెంట్లకి ఫిదా అయిపోయాను. హంసలా డాన్సు చేస్తున్నావు. నా కళ్లు నిన్నే చూస్తున్నాయి. చాలా గ్రేస్‌ ఫుల్‌తో డాన్సు చేస్తున్నావు. అమేజింగ్‌ డాన్సర్‌` అని పేర్కొంది సమంత.
 

దీనికి సాయిపల్లవి థ్యాంక్స్ చెప్పడం విశేషం. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో సాయిపల్లవి చాలా చిన్న పిల్లలా ఉంది. సమంత క్యూట్‌గా కనిపిస్తుంది. 

`ఏం మాయ చేసావే` చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయిన సమంత ఆ ఒక్క సినిమాతో ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు సాగిపోయింది. అనేక విజయవంతమైన సినిమాలు చేసింది. స్టార్‌ హీరోలందరితోనూ చేసింది. నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయింది. ఆ డిప్రెషన్‌ కారణంగా అనారోగ్యానికి గురయ్యింది. అందుకోసం ఏడాది పాటు విశ్రాంతి తీసుకుంది. ప్రస్తుతం మళ్లీ కమ్‌ బ్యాక్‌ కోసం ప్లాన్‌ చేస్తుంది. 
 

మరోవైపు సాయిపల్లవి `ఫిదా` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. తొలి చిత్రంతోనే అదరగొట్టింది. తెలుగు ఆడియెన్స్ ని ఫిదా చేసింది. ఆ తర్వాత `ఎంసీఏ`, `పడి పడి లేచే మనసు`, `లవ్‌ స్టోరీ`, `శ్యామ్‌ సింగరాయ్‌`, `విరాటపర్వం` చిత్రాల్లో నటించింది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు `తండేల్‌` మూవీలో నటిస్తుంది. నాగచైతన్య ఇందులో హీరో.

click me!