సాయి పల్లవి అన్నా అని పిలవడంతో.. ఫీల్ అయిన స్టార్ హీరో.. ఏం చేశాడో తెలుసా..?

First Published Oct 20, 2024, 8:46 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ తో దూసుకుపోతోంది సాయి పల్లవి. సెలెక్టెడ్ గా సినిమాలు చేసే ఈబ్యూటీ.. ఓ స్టార్ హీరోను అన్నా అని పిలిచిందట. దాంతో ఆ హీరో తెగ ఫీల్ అయ్యాడట. ఇంతకీ ఆ హీరో ఎవరు..? 

లేడీ న్యాచురల్ స్టార్.. సౌత్ ఇండియన్  స్టార్ నటి సాయి పల్లవి. అందరు హీరోయిన్లలా కాదు సాయిపల్లవి.  ముఖానికి పెయింట్, పెదాలకు లిప్ స్టిక్ వేసుకుని, పొట్టి డ్రస్సులు  వేసుకోవడం ఆమెకు అలవాటు లేదు. చాలాసింపుల్ గా ఉంటుంది ...మేకప్ ను ముఖం మీదకు రానివ్వదు.. అవసరం అయితే చాలా లిమిటెడ్ గా వేసుకోవడం తప్పించి అవసరం లేకున్నా పులుముకోవడం ఆమెకు అలవాటు లేదు. 

Also Read: పవన్ కళ్యాణ్ ‌- దీపిక పదుకొనే కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా

Sai Pallavi

పాత్రలకు ఇంపార్టెన్స ఉంటేనే చేస్తుంది సాయి పల్లవి.  మరీముఖ్యంగా హీరో డామినేషన్ ఉన్న సినిమాలు చేయడం ఆమకు ఇష్టం ఉండదని టాక్. అందుకే స్టార్ హీరోలు.. సూపర్ స్టార్లతో అవకాశం వచ్చినా.. కథ నచ్చక సినిమాలను రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. అంతే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎక్స్పోజింగ్ చేయని  హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే సాయిపల్లవి పేరే ముందుగా గుర్తుకొస్తుంది. 

Also Read:  కమల్ హాసన్ తో ప్రేమ, భర్త చేతిలో మోసపోయి, ఆస్తి పేదలకు దానం చేసి.. అనాధలా మరణించిన హీరోయిన్ ..?

Latest Videos


Sai Pallavi starrer Amarans video out

అద్భుతమైన కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ కెరియర్ లో దూసుకుపోతున్న సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం సినిమాలో చేస్తోంది. ఈసినిమాలో ఆమె సీనత పాత్రలో కనిపించబోతోంది. ఈసినిమాతో పాటు తమిళంలో శివకార్తికేయన్ తో ఓ దేశ భక్తి సినిమా చేస్తోంది సాయి పల్లవి. అయితే  సాయి పల్లవికి సబంధించన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే.. సాయి పల్లవి ఓ స్టార్ హీరోను అన్నా అని పిలిచిందట. దాంతో ఆయన ఫీల్ అయ్యారట. 

Also Read:  సమంత తో నటించొద్దు.. బాలీవుడ్ హీరోను హెచ్చరించింది ఎవరు..?

ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు శివకార్తికేయన్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా మూవీ  అమరన్. బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్‏గా వస్తోన్న ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది,

అక్టోబర్ 31న దివాళి సందర్భంగా  ఈ సినిమా  రిలీజ్ కు రెడీ అవుతోంది. తెలుగు,  తమిళ  భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతున్న ఈమూవీ ప్రమోషన్స్   జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే అమరన్ నుంచి  రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్ నటిస్తున్నారు. తాజాగా చెన్నై వేదికగా ఈ మూవీ  ప్రీరిలీజ్ ఈవెంట్  గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుక్లో హీరో శివకార్తికేయన్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. 

Also Read: ఒక్క రాత్రికే 70,000 ఖర్చుపెట్టిన పూజా హెగ్డే

ఈ కార్యక్రమంలో శివకార్తికేయన్ మాట్లాడుతూ సాయి పల్లవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సాయి పల్లవి గురించి  ఆయన చెప్పిన విషయాలు అందరికి  ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆయన మాట్లాడుతూ.. నేను గతంలో ఓ టీవీ ఛానల్లో పనిచేశాను. అప్పుడే  సాయి పల్లవిని మొదటిసారి కలిశాను. నేను హోస్టింగ్ చేసిన ఓ షోకు ఆమె గెస్ట్ గా వచ్చింది. ఇండస్ట్రీలో ఆమె అప్పటికే ఓ బ్రాండ్. 

 ఆతరువాత ప్రేమమ్ సినిమాలో ఆమె యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయాను. ఫోన్ చేసి ప్రశంసించాను. వెంటనే ఆమె థాంక్యూ అన్నా అన్నారు. ఆ టైమ్ లో  నన్ను అన్నా అని అనడంతో  ఫీలయ్యాను అంటూ సరదాగా చెప్పుకొచ్చారు శివకార్తికేయన్. శివ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఆయన సినిమా గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడారు. 

Also Read:  త్రిష ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

మేజర్ ముకుంద్ వరదరాజన్ గురించి న్యూస్ లో విన్నాను.. . డైరెక్టర్ రాజ్ కుమార్ ఈ కథ గురించి చెప్పినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. అంత గోప్ప లీడర్ పాత్ర చేయడం అదృష్టంగా బావిస్తున్నాను.. ఇక ఈసినిమా షూటింగ్.. యాక్షన్ సీన్స్ ను కశ్మీర్ లో 100 రోజుల పాటు షూటింగ్ చేశాం అన్నారు శివకార్తికేయన్. ఈమూవీ క్లైమాక్స్ కన్నీరు తెప్పిస్తుంది.. ఈసినిమాతో ముకుందన్ పై.. ఆయన ఫ్యామిలీపై గౌరవాన్ని పెంచుతుంది అన్నారు హీరో. 

Also Read: అత్యధిక సార్లు జాతీయ అవార్డును గెలుచుకున్న హీరో ఎవరో తెలుసా?

click me!