అదే సమయంలో తెలియకుండానే పల్లవి ప్రశాంత్ని స్ట్రాంగ్ కంటెస్టెంట్గా మారుస్తున్నారు. ఎనిమిది మంది ఒక్కడినే టార్గెట్ చేశారు, అది కూడా ఒకే కారణంతో అంటే వారంతా అతని విషయంలో భయపడుతున్నారనే అభిప్రాయానికి వస్తున్నారు. వాళ్లు ఏం చేయలేక అతనిపై పడ్డారని, కానీ ఇదంతా అది ప్రశాంత్కే ప్లస్ అవుతుందని, అతనే మరింత ఎలివేట్ అవుతున్నాడని, తెలియకుండానే వాళ్లంత కలిసి పల్లవి ప్రశాంత్ని టాప్లోకి తీసుకెళ్లారని ఆదిరెడ్డి లాంటి రివ్యూవర్స్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు టైటిల్ రేస్లో ఉండే సత్తా అతనిలో ఉందని, కాకపోతే ఆట తీరు మార్చుకోవాలని అంటున్నారు. ప్రేమ, దోమలు కాకుండా తన గేమ్పై ఫోకస్ పెట్టి, లాజికల్గా ఆడితే టాప్ 5లో ఉంటాడని చెబుతున్నారు. హౌజ్లో జరిగే పరిణామాలు కూడా అలాంటి సంకేతాలనే ఇస్తున్నాయి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.