సినిమాల్లో సౌత్ అంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమలను పరిగణలోకి తీసుకుంటారు. అదే నార్త్ అంటే బాలీవుడ్ వస్తుంది. దానికి మించిన పరిశ్రమ నార్త్ లేవు. మన సౌత్ హీరోయిన్స్ ఇప్పుడు నార్త్ పై కన్నేశారు. సౌత్లోనే కాదు, నార్త్ ని కూడా ఏలేస్తామంటున్నారు. గ్లామరే కాదు, నటనతోనూ ఉక్కిరి బిక్కిరి చేస్తామంటున్నారు.
undefined
సౌత్ నుంచి వెళ్లిన హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె, ఐశ్వర్య రాయ్, అదితి రావు హైదరీ ఇప్పుడు బాలీవుడ్ ఏలుతుండగా, జయప్రద, టబు, సుస్మితా సేన్, హేమా మాలిని, రేఖ వంటి భామలు ఇప్పటికే బాలీవుడ్ని ఓ ఊపు ఊపేశారు. బాలీవుడ్లో వీరిని మించిన స్టార్ హీరోయిన్స్ లేరంటే అతిశయోక్తి కాదు.
undefined
వారితోపాటు మరోసారి సౌత్ నుంచి బాలీవుడ్కి వెళ్తున్నారు మన భామలు. ఇక్కడ సత్తా చాటి బాలీవుడ్లో తామేంటో నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నారు.
undefined
తాజాగా నార్త్ లోకి నయనతార వెళ్తుంది. ఆమె అట్లీ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రంలో షారూఖ్ ఖాన్తో నటించబోతుంది. ఇప్పటి వరకు తెలుగు, తమిళం, మలయాళంలో నటించి హీరోయిన్గా ఓ ఊపు ఊపిన నయన్ ఇప్పుడు బాలీవుడ్పై కన్నేసింది. ఎంట్రీతోనే భారీ సినిమా కావడం విశేషం.
undefined
హిందీలో సత్తా చాటేందుకు రెడీ అవుతుంది `నేషనల్ క్రష్` రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ `మిషన్ మజ్ను`, `గుడ్ బై` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు మరో సినిమాకి సైన్ చేసింది. హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన అనతి కాలంలోనే బాలీవుడ్ వెళ్లింది. సౌత్లో తానేంటో నిరూపించుకుని నార్త్ పై కన్నేసింది.
undefined
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత సైతం బాలీవుడ్పై కన్నేసిందని టాక్. ఇప్పటికే ఆమె `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్తో బాలీవుడ్లో పాగా వేసింది. అక్కడి ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఈ సిరీస్లో సమంత పాత్రనే హైలైట్గా నిలవడం విశేషం. అంతేకాదు మున్ముందు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించేందుకు ప్లాన్ చేస్తుందట. అదే సమయంలో హిందీ నుంచి కూడా అమ్మడికి ఆఫర్స్ వస్తున్నాయని టాక్.
undefined
సమంతతోపాటు `ఢీ` బ్యూటీ, సౌత్ స్టార్ హీరోయిన్ ప్రియమణి సైతం నార్త్ పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆమె `మైదాన్` చిత్రలో అజయ్ దేవగన్తో హిందీలో నటిస్తుంది. అలాగే ఇటీవల `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్తో బాలీవుడ్ ఆడియెన్స్ కి పలకరించింది. ఆమెకి బాలీవుడ్ నుంచి మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయని టాక్.
undefined
నిత్యా మీనన్ సైతం బాలీవుడ్కి తన నటనా టేస్ట్ ని చూపించింది. ఆమె మూడేళ్ల క్రితం `మిషన్ మంగళ్` చిత్రంలో అక్షయ్తో కలిసి నటించి బిగ్ బ్లాక్ బస్టర్ని అందుకుంది. అలాగే `బ్రీత్ః ఇన్టూ ది షాడో` వెబ్ సిరీస్తోనూ హిందీలో మెరిసింది. నెక్ట్స్ హిందీలో తనదైన పాత్రలతో మెప్పించేందుకు రెడీ అవుతుందట నిత్యా మీనన్.
undefined
వీరితోపాటు నార్త్ కి చెందిన స్టార్ హీరోయిన్స్ రకుల్, పూజా హెగ్డే, తమన్నా, తాప్సీ, శ్రియా వంటి భామలు సౌత్లో నిరూపించకుని, నార్త్ లో రాణించేందుకు కష్టపడుతున్నారు. ఈ విషయంలో తాప్సీ సక్సెస్ కాగా, రకుల్, తమన్నా ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు.
undefined