రష్మిక బ్లాక్‌ బెల్ట్ పోజులు.. వేరే డ్రెస్సే దొరకలేదా.. రచ్చ చేస్తున్న నెటిజన్లు..

First Published Dec 17, 2022, 4:13 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా గ్లామర్‌ బ్యూటీగా మారిపోయిన విషయం తెలిసిందే. ఆమె అందాలు ఆరబోయడంలో ఎప్పుడో హద్దులు చెరిపేసింది. స్కిన్‌ షోకి తెరలేపిన ఈ భామ ధరించిన డ్రెస్‌ హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

రష్మిక మందన్నా(Rashmika Mandanna) తాజాగా కరాటే క్వీన్‌లా మారిపోయింది. కరాటేలో బ్లాక్‌ బెల్ట్ సాధించిన వారు వేసుకునే డ్రెస్‌ వేసింది. ఓ ఈవెంట్‌లో పాల్గొని రచ్చ చేసింది. చిలిపి పోజులతో కవ్విస్తూ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇప్పుడు రష్మిక మందన్నా ధరించిన డ్రెస్‌ చర్చనీయాంశం అవుతుండటం విశేషం. 
 

చూడ్డానికి కరాటేలో బ్లాక్‌ బెల్ట్ సాధించిన వారిలా వైట్‌ జాకెట్‌, ఫ్యాంట్‌ని ధరించింది. మధ్యలో బ్లాక్‌ రిబ్బన్‌ కట్టింది. కరాటేలో నైపుణ్యం పొందిన వారు ఇలాంటి డ్రెస్సే ధరిస్తారనే విషయం తెలిసిందే. తాజాగా రష్మిక అలాంటి డ్రెస్‌ వేయడంతో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. ఫన్నీ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 

రష్మిక కరాటే క్వీనా? రష్మికతో జాగ్రత్త తేడా వస్తే ఎముకలు ఇరిగిపోవాల్సిందే అని, చూడ్డానికి అందంగా, సుకుమారంగా ఉందనుకునేరు, టచ్‌ చేస్తే చిత్తడైపోవాల్సిందే అని, వామ్మో శ్రీవల్లిలో ఇలాంటి కళ కూడా ఉందా అంటున్నారు. సెటైర్లు, ఫన్నీ కామెంట్లతో వైరల్‌ చేస్తున్నారు. మరికొందరు వేసుకోవడానికి వేరే డ్రెస్సే లేదా అంటుండటం గమనార్హం. మొత్తానికి డ్రెస్‌ ఏదైనా ఇప్పుడు రష్మిక వార్తల్లో నిలవడం విశేషం. 
 

రష్మిక మందన్నా హిందీలో నటించిన `మిషన్‌ మజ్ను` చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. ఇది ఓటీటీలో రిలీజ్‌ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ ఫ్లిక్స్ లో జనవరి 20న విడుదల కాబోతుంది. ఇటీవల టీజర్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో రష్మిక మందన్నా పాల్గొంది. హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి ఆమె సందడి చేసింది. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఓ టీజింగ్‌ సన్నివేశం ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 
 

ఇటీవల రష్మిక నటించిన హిందీ ఫిల్మ్ `గుడ్‌బై` థియేటర్లలో విడుదలై నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. ఇప్పుడు రెండో సినిమాగా `మిషన్‌ మజ్ను` రాబోతుంది. ఇది రియలిస్టిక్‌ స్టోరీతో దేశభక్తి ప్రధానంగా సాగబోతుంది. విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంటోంది. దీంతోపాటు ఆమె బాలీవుడ్‌లో `యానిమల్‌` సినిమాలో నటిస్తుంది. 
 

మరోవైపు తెలుగులో ఇప్పుడీ బ్యూటీ `పుష్ప2`లో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. అలాగే తమిళంలో చేస్తున్న `వారసుడు` సినిమా సంక్రాంతికి రాబోతుంది. విజయ్‌ హీరోగా రూపొందిన ఈ సినిమాకి వంశీపైడిపల్లి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు దీన్ని నిర్మించారు. దీంతోపాటు మరో తమిళ సినిమాలో నటిస్తుంది రష్మిక. 

click me!