సినిమా ఆశలు వదులుకుని చదువుపై దృష్టి పెట్టానని, ఈ క్రమంలో ఓ రోజు `కిర్రిక్ పార్టీ` టీమ్ నుంచి ఫోన్ వచ్చిందట. రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిలు తనని ఆడిషన్ చేశారట. ఆడిషన్లో సెలక్ట్ కాగానే చేతిలో చెక్ పెట్టారని, అది చూసి షాక్ అయినట్టు చెప్పింది రష్మిక. అప్పటి వరకు తాను బ్యాంక్కి కూడా వెళ్లలేదు. ఆ చెక్ని చూసి అమ్మకి ఫోన్ చేసి, సినిమాలో సెలక్ట్ అయ్యాను, చెక్ ఇచ్చారు, దీన్ని ఏం చేయాలని అడిగిందట. ఆ తర్వాత అమ్మ రక్షిత్, రిషబ్లను కలిసి కన్ఫమ్ చేసుకున్నాక సినిమాకి ఓకే చెప్పానని తెలిపింది. అలా తన తొలి సినిమా ఎంట్రీ జరిగిందని పేర్కొంది రష్మిక మందన్నా.