నేషనల్ క్రష్ మత్తుగా చూస్తే యువత చిత్తే.. నవ్విందంటే నెట్టింట రచ్చే.. రష్మిక మందన్న లేటెస్ట్ పిక్స్ వైరల్..

First Published Aug 10, 2022, 11:04 AM IST

నేషనల్‌ క్రష్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న రష్మిక మందన్న (Rashmika Mandanna) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. అలాగే అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది. తాజాగా తను షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎదిగిన రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్లో పాగా వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడ మూడు భారీ చిత్రాల్లో  నటిస్తోంది.`మిషన్‌ మజ్ను`, `గుడ్‌బై` సినిమాలతో పాటుు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌ బీర్‌ కపూర్‌ సరసన `యానిమల్‌` చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీని ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు  సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

బాలీవుడ్ ను ఒకచేతితో ఏలుతూనే.. ఇటు టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నూ నటిస్తోంది.  మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన  తాజా చిత్రం ‘సీతా రామం’. ఈ చిత్రం ఇటీవలనే  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. ఈ మూవీలో రష్మిక మందన్న కూడా ఓ కీలక పాత్రలో నటించింది. 
 

వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. Sita Ramam మూవీ ప్రమోషన్స్ లోనూ పాల్గొంది.  అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో కనిపిస్తూ ఆడియెన్స్ మతిపోగొట్టింది. ఆ అవుట్ ఫిట్ లోనే అదిరిపోయే లా ఫొటోషూట్లు కూడా చేసింది. అయితే అప్పటి ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది. 
 

రష్మిక పంచుకున్న ఫొటోల్లో గ్లామరస్ గా కనిపిస్తోంది. క్లోజప్ షాట్ లో మత్తు ఫోజులతో టెంపరేచర్ పెంచేస్తోంది. మరో ఫొటోలో చిరు నవ్వు చిందిస్తూ యువతను చిత్తు చేసింది. బ్లాక్ షర్ట్ ధరించి, డార్క్  ట్రెండీ  లెహంగా ధరించి అట్రాక్ట్ చేస్తోంది. సీతా రామం రిలీజ్ సందర్భంగా ఇలా తన ఫ్యాషన్ సెన్స్ తోనూ ఆకట్టుకుందీ బ్యూటీ.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామా అభిమానులతో ఎప్పటికప్పడు తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినీ విశేషాలను పంచుకుంటుంటుంది. అలాగే ప్రత్యేక రోజుల్లోనూ తన ఫ్రెండ్స్ తోనూ కలిసి కనువిందు చేస్తుంటుంది. ముఖ్యంగా రష్మిక బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాక గ్లామర్ షోలో హద్దులను దాటేస్తోంది.

సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘పుష్ఫ’లో నటించిన తర్వాత రష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో పాటు ‘పుష్ఫ : ది రూల్’లోనూ నటిస్తోంది. ఈ చిత్రంలో శ్రీవల్లి పాత్రకు నటనతో ప్రాణం పోసింది. దీంతో పార్ట్ 2 కోసం రష్మిక ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 
 

click me!