రష్మిక మందన్నా `ఛలో` చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఓ ఊపు ఊపేస్తుంది. `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్`, `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ`, `పుష్ప`, `ఆడవాళ్లు మీకు జోహార్లు` వంటి చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన చిత్రాల్లో కేవలం రెండు సినిమాలు మాత్రమే పరాజయం చెందాయి. అత్యధిక సక్సెస్ రేట్ కలిగిన హీరోయిన్గా పేరుతెచ్చుకుంది రష్మిక.