‘జబర్దస్త్’ కొత్త యాంకర్ పై స్పందించిన రష్మీ గౌతమ్.. తన ఒపీనియన్ చెప్పేసిన స్టార్ యాంకర్!

First Published Nov 10, 2022, 1:01 PM IST

జబర్దస్త్.. ఖతర్నాక్ కామెడీ షోకు తాజాగా మరో ఖతర్నాక్ యాంకర్  ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ కొత్త యాంకర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమెపై నెగెటివ్ ఓపీనియన్ ఉందనే వార్తలపైనా స్పందించింది.
 

తెలుగు ప్రేక్షకులను దాదాపు పదేండ్లుగా కడుపుబ్బా నవ్విస్తున్న పాపులర్ తెలుగు కామెడీ షో ‘జబర్దస్త్’ (Jabardasth). 2012లోనే ప్రారంభమైన ఈషో అనతికాలంలోనే ప్రేక్షకాదరణ పొంది ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోంది.
 

‘జబర్దస్త్’తో ఎంతో మంది నటీనటులు పాపులర్ అయ్యారు. ముఖ్యంగా రష్మీ గౌతమ్ (Rashmi Gautam), అనసూయ (Anasuya) ఈషోల ద్వారా యమా క్రేజ్ దక్కించుకున్నారు. స్టార్ హీరోయిన్లుగా  తారా స్థాయికి చేరుకొని.. ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నారు. 
 

బుల్లితెరపై తమ యాంకరింగ్ స్కిల్స్ తో పాటు.. గ్లామర్ విందుతోనూ టీవీ ఆడియెన్స్ కు విజువల ట్రీట్ అందించారు. షోకు మించి అందాలను ఆరబోయడంతో ఇటు సినిమాల్లోనూ అవకాశాలను అందుకున్నారు. కొద్దిరోజుల కిందనే షో నుంచి వెళ్లిపోయిన ఈ యాంకర్లు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 
 

జబర్దస్త్ కు మొన్నటి వరకు యాంకర్ రష్మీ గౌతమ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రీసెంట్ గా రష్మీ స్థానంలో కొత్త యాంకర్ సౌమ్య రావు (Sowmya rao)ను మల్లెమాల ఇంట్రడ్యూస్ చేసిన విషయం తెలిసిందే. కాగా, రష్మీ గౌతమ్ కు కొత్త యాంకర్ పై నెగెటివ్ ఓపీనియర్ ఉందని రూమర్లు పుట్టుకొస్తున్నాయి.

ఈ క్రమంలో ‘బొమ్మ బ్లాక్ బాస్టర్’(Bomma Blockbuster) చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా  తాజాగా రష్మీ గౌతమ్ కొత్త యాంకర్ సౌమ్యపై స్పందించారు. రష్మీ మాట్లాడుతూ.. తను జబర్దస్త్ షోకు కొత్త యాంకర్ గా రావడం పట్ల సంతోషంగా ఉందన్నారు. సౌమ్య రావు పై నాకు ఎలాంటి ఓపీనియన్ లేదని చెప్పారు.

షోకు కొత్త యాంకర్ వస్తుందని తనకు ముందే తెలుసని రష్మీ చెప్పారు. అనసూయ వెళ్లిపోవడంతో కొద్దిరోజుల వరకే షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించాలని మల్లేమాల సంస్థ కోరినట్టు తెలిపారు. మళ్లీ మల్లెమాల అవకాశం ఇస్తే తప్పకుండా షోకు తిరిగి వస్తానని చెప్పింది. ప్రస్తుతం రష్మీ గౌతమ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 

click me!