`ముద్దు ఇస్తా రా`.. అందరి ముందు జబర్దస్త్ కమెడియన్‌కి రష్మి గౌతమ్‌ ఆఫర్‌.. పరిగెత్తుకుంటూ రావడంతో ట్విస్ట్

Published : Jun 19, 2024, 05:42 PM ISTUpdated : Jun 19, 2024, 07:23 PM IST

యాంకర్‌ రష్మి గౌతమ్‌.. జబర్దస్త్ కమెడియన్‌కి అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చింది. షోలో అందరి ముందు ముద్దు ఆఫర్‌ ఇచ్చింది. ఆమెకి సంబంధించిన మరో షాకింగ్‌ విషయం బయటపెట్టాడు మరో కమెడియన్‌.  

PREV
16
`ముద్దు ఇస్తా రా`.. అందరి ముందు జబర్దస్త్ కమెడియన్‌కి రష్మి గౌతమ్‌ ఆఫర్‌.. పరిగెత్తుకుంటూ రావడంతో ట్విస్ట్

`జబర్దస్త్` మోస్ట్ పాపులర్‌ కామెడీ షో. పదేళ్లుగా నాన్‌ స్టాప్‌గా నవ్వులు పూయిస్తూనే ఉంది. అయితే ఇటీవల ఆ కామెడీ డోస్‌ తగ్గిందని చెప్పి, ఓ షోనే లేపేశారు నిర్వాహకులు. ఎక్స్ ట్రా జబర్దస్త్ ని తొలగించి, కేవలం జబర్దస్త్ షోనే రెండు ఎపిసోడ్లుగా ప్రసారం చేస్తున్నారు. గురు, శుక్రకి బదులు, శుక్రవారం, శనివారం టెలికాస్ట్ చేస్తున్నారు. జడ్జ్ ఇంద్రజ వెళ్లిపోయారు. టీమ్‌లు కుదించారు. ఆరు టీముల్లో కమెడియన్లని అడ్జెస్ట్ చేశారు. కాంపిటీషన్‌ బాగాపెరిగింది. 

26

ఇక జబర్దస్త్ యాంకర్‌గా రష్మి గౌతమ్‌ కొనసాగుతుంది. సిరి వెళ్లిపోయారు. రెండు షోలకు రష్మినే యాంకర్‌గా వ్యవహరిస్తుంది. అంతేకాదు తన ఫన్‌ యాంగిల్‌ని కూడా పెంచారు. చాలా యాక్టివ్‌గా మారింది. కమెడియన్లపై సెటైర్లు పేలుస్తూ రెచ్చిపోతుంది. తాజాగా ఆమె చేసిన పనికి అంతా షాక్‌ అయ్యారు. కానీ జబర్దస్త్ కమెడియన్‌ మాత్రం పండగ చేసుకున్నాడు. కానీ అంతలోనే పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. 
 

36

నూకరాజు చీపురు పట్టుకుని వచ్చి రష్మిని పలకరించారు. ఏంటీ రష్మి ఎలా ఉన్నావ్‌ అని అడిగాడు. దీంతో నేను బాగానే ఉన్నాలే గానీ, ఏంటి కామెడీ ఉంటుందా? అని అడిగింది. దానికి ఏంటో అంటూ వినపడనట్టుగా రియాక్ట్ అయ్యాడు నూకరాజు. రెండు సార్లు అడిగినా అలానే రియాక్ట్ అయ్యాడు. 

46

దీంతో నూకరాజుకి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది రష్మి. ఆయనకు సరిగ్గా వినపడనట్టుగా యాక్ట్ చేస్తున్న నేపథ్యంలో సరే రా ముద్దుపెడతా అంటూ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. దెబ్బకి మనోడు ఆనందంతో రెచ్చిపోయాడు. ఆ వస్తున్నా అంటే ఆలస్యం లేకుండా పరిగెత్తుకుంటూ ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో పెద్ద ట్విస్ట్ ఇచ్చింది రష్మి. చెప్పుతీసుకొని కొడతా అంటూ బెదిరించింది. దెబ్బకి ఎంత ఫాస్ట్ గా వెళ్లాడో, అంతే వేగంగా బ్యాక్‌ అయ్యాడు నూకరాజు. దీంతో హౌజ్‌లో ఇది నవ్వులు పూయించింది. 
 

56

మరోవైపు రష్మికి సంబంధించిన మరో రహస్యాన్ని బయటపెట్టాడు రామ్‌ ప్రసాద్‌. ఆయన పేపర్‌ చదువుతూ రష్మి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. `ఎక్స్ ట్రా జబర్దస్త్ ఆపేశారని, రష్మి విషం తాగుతూ, ఇంతలో యాజమాన్యం రెండు ఎపిసోడ్లు నువ్వే చేస్తున్నావని చెప్పడంతో విషం పక్కన పెట్టి విస్కీ తాగిందని బాంబ్‌ పేల్చాడు రామ్‌ ప్రసాద్‌. దెబ్బకి షోలో మొత్తం నవ్వులు విరిసాయి. 
 

66

కామెడీ స్కిట్లలో భాగంగా వీళ్లు ఇలా రష్మిని వాడుకుని కామెడీ చేసే ప్రయత్నం చేశారు.నవ్వులు పూయించారు. ఈ లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన జబర్దస్త్ ప్రోమో విడుదలైంది. ఇది యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. అయితే ఈ సారి మొత్తం రష్మి చుట్టూనే కామెడీ స్కిట్లు తిరగడం విశేషం. దీంతోపాటే ఏపీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కూటమి గెలిచిన నేపథ్యంలో వారిపై కూడా కామెడీ చేసి నవ్వించే ప్రయత్నం చేశారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories