రష్మీ ప్రేమించింది ఎవరిని.. మనసిచ్చిన వాడికోసం సూసైడ్ అటెంప్ట్, చివరకు జరిగిందేంటి ?

First Published May 28, 2022, 9:40 AM IST

ప్రతి శుక్రవారం ప్రసారం అయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్.. ఇమ్మాన్యూల్, వర్ష, రాకింగ్ రాజేష్ లాంటి కమెడియన్లు తమ స్కిట్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు.

ప్రతి శుక్రవారం ప్రసారం అయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్.. ఇమ్మాన్యూల్, వర్ష, రాకింగ్ రాజేష్ లాంటి కమెడియన్లు తమ స్కిట్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు. ఒకరిని మించేలా మరొకరు స్కిట్స్ తో ముందుకు వస్తున్నారు. 

జూన్ 3న ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. విశేషం ఏంటంటే ఈ ఎపిసోడ్ కి హీరోయిన్ సదా జడ్జిగా హాజరయ్యారు. ప్రోమోలో చూపించిన ఫన్నీ ఎలిమెంట్స్ చాలా బావున్నాయి. ఇమ్మాన్యూల్, బులెట్ భాస్కర్ ఈసారి బాహుబలి పేరడీతో వచ్చేశారు. ఇమ్మాన్యూల్ కట్టప్ప వేషం ధరించి నవ్వులు పూయిస్తున్నాడు. 

రోహిణి ఈ స్కిట్ లో రాజమాత శివగామి గెటప్ లో కనిపించింది. అన్ని పాత్రలు ఫన్నీగా బిహేవ్ చేస్తుండడంతో కామెడీ బాగా పండుతోంది. ఇమ్మాన్యూల్ సదాపై, రష్మీపై వేస్తున్న జోకులు ఆకట్టుకుంటున్నాయి. కట్టప్ప భార్యతో రాజమాత దెబ్బలు తినడం సరదాగా ఉంది. బాహుబలిని కూనీ చేస్తున్నప్పటికీ ఫన్ జనరేట్ చేస్తున్నారు. 

ఇక ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్ స్కిట్ లో రష్మీ కూడా పాల్గొంది. ఈ స్కిట్ లో రష్మీ ఆటో రాంప్రసాద్ చెల్లిగా నటించింది. ఆటో రాంప్రసాద్ తన చెల్లికి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు. పెళ్లి కూతురిగా రష్మీ సాంప్రదాయ వస్త్రధారణలో అందంతో వెలిగిపోతోంది. మా చెల్లి ఎలా ఉంది అని రాంప్రసాద్ సన్నీని అడుగుతాడు. చాలా చాలా అందంగా ఉంది అని చెబుతాడు. దీనికి రాంప్రసాద్ మేకప్ లేకపోతే యావరేజ్ అని చెప్పడం చాలా ఫన్నీగా ఉంటుంది. 

పెళ్లి పీటలమీద కూర్చునే టైంకి రష్మీ అన్నయ్య నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను మరొకరిని ప్రేమించా అని చెబుతుంది. నేను నిద్రమాత్రలూమిగేస్తా అని బెదిరిస్తోంది. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు పడుకుంటావా అని రాంప్రసాద్ అడగడంతో నవ్వులు పూస్తాయి. 

మనం ఒకరికి మానసిస్తే ఈ గుండెలో జీవితాంతం స్థానం వాళ్ళకి మాత్రమే అని రష్మీ ఎమోషనల్ గా చెబుతుంది. చివరకు పెళ్ళికి రెడీ అయిపోతుంది. వరుడిగా వచ్చిన అబ్బాయి ముఖానికి మల్లెపూల తొడుగు ఉంటుంది. దీనితో ముఖం కనిపించదు. పెళ్లి ఇష్టం లేదు అంటూనే రష్మీ పెళ్లి పీటలపై కూర్చుంటుంది. అయితే ఆ అబ్బాయి సుధీర్ ఏనా కాదా అనేది ట్విస్ట్. ఈ ఎపిసోడ్ జూన్ 3న ప్రసారం కాబోతోంది. 

click me!