ఇక బిడ్డని కనలేను..ఈ నరకం అనుభవించిన వారికే తెలుస్తుంది, హీరోయిన్ ఆవేదన

First Published Mar 22, 2024, 7:42 PM IST

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో రాణి ముఖర్జీ ఒకరు. రాణి ముఖర్జీతో గ్లామర్ పాత్రలతో పాటు లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించింది. 1998 నుంచి ఇప్పటి వరకు రాణి ముఖర్జీ ఎన్నో చిత్రాల్లో నటించింది.

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో రాణి ముఖర్జీ ఒకరు. రాణి ముఖర్జీతో గ్లామర్ పాత్రలతో పాటు లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించింది. 1998 నుంచి ఇప్పటి వరకు రాణి ముఖర్జీ ఎన్నో చిత్రాల్లో నటించింది. రాణి ముఖర్జీ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా ఎదిగిందంటే అందులో ఆదిత్య చోప్రా ప్రమేయం కూడా ఉంది. రాణి ముఖర్జీని పలు చిత్రాలకు ఆదిత్య చోప్రా రికమండ్ చేశారు. 

2014లో ఆదిత్య చోప్రా, రాణి ముఖర్జీ వివాహం చేసుకున్నారు. ఆదిత్య చోప్రా బాలీవుడ్ లో బడా నిర్మాత అనే సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేతే ఆదిత్య చోప్రా. ఈ జంటకి 2014లో ఒక కుమార్తె జన్మించింది. 

rani mukerji

అయితే పిల్లల విషయంలో రాణి ముఖర్జీ నరకం అనుభవిస్తోందట. తాజాగా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రాణి ముఖర్జీ భావోద్వేగానికి గురవుతూ తెలిపింది. గర్భంలోనే శిశువుని కోల్పోతే ఆ తల్లి పడే వేదన ఎలా ఉంటుందో తాను అనుభవించానని తెలిపింది. మరోసారి ఆ బాధని గుర్తు చేసుకుంది. 

రాణి ముఖర్జీ మాట్లాడుతూ నా కూతురికి ఏడాది వయసు రాగానే మరో బిడ్డ కోసం ప్రయత్నించాం. ఐదేళ్ల తర్వాత 2020లో మరోసారి గర్భవతి అయ్యాను. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదు. నాకు గర్భస్రావం జరిగింది. దీనితో కడుపులోనే బిడ్డని కోల్పోయా. ఆ నరకం వర్ణనాతీతం. నేను పైకి కనిపించేంత యంగ్ కాదు. నా వయసు ఇప్పుడు 46 ఏళ్ళు. 

ఈ వయసులో ఇక బిడ్డని కనలేను. నా కూతురికి ఒక తమ్ముడినో, చెల్లినో ఇవ్వలేకపోతున్నాననే బాధ మాకు జీవితాంతం ఉంటుంది. నా కూతురు అధీరా బంగారు తల్లి. తన వల్లే నేను సంతోషంగా ఉండగలుగుతున్నా. ఇప్పుడు నేను బిడ్డని కనే వయసు దాటేశాను. ఉన్నదాంట్లోనే సంతోషం వెతుక్కోవాలి అని రాణి ముఖర్జీ భావోద్వేగానికి గురైంది. 

రాణి ముఖర్జీ తన కెరీర్ లో హలో బ్రదర్, సాథియా, చల్తే చల్తే, ప్యార్ దివానా హోతాహై లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే ఆమె వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. 

click me!