చిన్న సినిమాగా ఈరోజు (నవంబర్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన రివేంజ్ డ్రామా ‘రణస్థలి’(Ranasthali). సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై అనుపమ సురెడ్డి నిర్మించిన చిత్రమే ‘రణస్థలి’. పరశురామ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ధర్మ హీరోగా అమ్ము అభిరామి, చాందిని రావులు హీరోయిన్లుగా నటించారు. ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర, విజయ్ రాగం.. కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకున్న ఈ చిత్రం థియేటర్లలో మెప్పించిందా? లేదా? ఇంతకీ కథేంటి? ఎలా ఉందనే విషయాలను రివ్యూలో తెలుసుకుందాం.