ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇందులో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్ గా నటిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ హీరోయిన్ తండ్రి పాత్రను పోషిస్తున్నారు. ``క్వీన్` చిత్రంలో ఒక పవర్ ఫుల్, స్ట్రాంగ్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ నటిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ తన నటనా ప్రతిభతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతున్నారు. `క్వీన్` చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా, రియల్ క్యారెక్టర్స్ ను స్ఫూర్తిగా తీసుకుని ఫిక్షనల్ స్టోరీతో దర్శకుడు రతన్ రిషి రూపొందిస్తున్నారు. 2006-2010 మధ్య కాలం నేపథ్యంగా ఈ చిత్ర కథ సాగనుంది. ప్రస్తుత సొసైటీ తో ముడిపడి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని ఈ చిత్రంలో ప్రేక్షకులు చూడబోతున్నారు. `క్వీన్` సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది` అని టీమ్ తెలిపింది. ఇందులో సాయికుమార్, అజయ్ ఘోష్, తనికెళ్ల భరణి, కాళకేయ ప్రభాకర్, నవీన్ బేతిగంటి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.