Janaki Kalaganaledu: గోవిందరాజులుపై సీరియస్ అయిన రామచంద్ర.. స్వార్థంగా ఆలోచిస్తున్న మల్లిక?

First Published Feb 7, 2023, 11:45 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 7వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్లో జానకి అవును లే రామా గారిది అంటే సొంత వ్యాపారం. రావాలి అనుకుంటే మధ్యాహ్నానికైనా రావచ్చు.  మీ ఆయనది అలా కాదు కదా ఒకరి కింద పని చేస్తున్నాడు కదా అంటూ మల్లిక కు రివర్స్ లో కౌంటర్ ఇస్తుంది. సొంతపని చేయడానికి ఒకరికి కింద పని చేయడానికి చాలా తేడా ఉంటుందని అంటుంది అనడంతో మల్లిక కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది. తను ఏదో అంది జానకి గారు మీరు ఎందుకు అలా మాట్లాడారు అనడంతో లేకపోతే బావ గారితో ఎలా మాట్లాడాలో తెలియదా అందుకే నేర్పించాను అని అంటుంది జానకి. అప్పుడు జానకి వాళ్ళు లోపలికి వెళ్తుండగా ఇంతలోనే ఒక అతను వచ్చి పొద్దున్నకి పెళ్లి ఉంది 70 కేజీల లడ్డు కావాలి అనడంతో రామచంద్ర ఆలోచిస్తూ ఉండగా తమ గారు ఒప్పుకోండి చేద్దాము అనడంతో 70 కేజీలు అండి అనడంతో అందరూ తలా ఒక చేయి వేస్తే అయిపోతుంది తొందరగా ఒప్పుకోండి అని అంటుంది జానకి.
 

అప్పుడు రామచంద్ర సరే అని అనడంతో అతడు సరుకులు పంపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత జానకి లోపలికి వెళ్ళగా అప్పుడు మలయాళం వంట చేయడానికి ఇబ్బంది పడుతూ ఉండగా అయిపోయిందా వంట చేయడం లేదా అనడంతో అయిపోయింది అని అంటాడు. ఇంతలోని రామచంద్ర ఇంటి లోపలికి వస్తుండగా ఒక అతని ఫోన్ చేసి మీ నాన్న మా రైస్ మిల్లు గుమస్తాగా చేరాడు నాకు కొంచెం పని ఉంది నువ్వే వచ్చి వదిలిపెట్టి రామన్న అని అంటాడు. ఆ మాటలకు రామచంద్ర షాక్ అవుతాడు. మరోవైపు గోవిందరాజులు అమ్మ వెన్నెల తొందరగా మందులు తీసుకొని రా అమ్మ త్వరగా పడుకోవాలి అనడంతో ఏ నాన్న ఉదయాన్నే రైస్ మిల్ కి వెళ్లాల అని అంటాడు. రైస్ మిల్ గా నాకేం పని రాముడు అని ఏమి తెలియనట్టుగా మాట్లాడుతాడు గోవిందరాజులు.
 

నిజం చెప్పండి నాన్న అనడంతో అవును గుమస్తాగా చేరాను ఇంట్లో కూర్చుని ఉంటే ఏం తోచడం లేదు అని అంటాడు. ఆపనైనా మీరు ఎందుకు చేయాలి మావయ్య గారు అని జానకి అనడంతో ఇంట్లో ఏం తోచడం లేదమ్మా అని అంటాడు. ఆరోగ్యం బాగా లేనప్పుడు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోకుండా ఈ పనులన్నీ మీకెందుకు నాన్న ఆడడంతో వెంటనే జ్ఞానాంబ లేచి నిలబడగానే ఇంట్లో ఉండాలని అనిపించడం లేదా అని అంటుంది. ఇప్పుడు ఇంట్లో తల ఒక మాట అనడంతో కాళ్ళు కదలకుండా కూర్చున్నప్పుడు అంతా ఒక పని చేస్తుంటే నేను ఏమి చేయలేకపోయాను అందుకే ఈ పని ఒప్పుకున్నాను అని అంటాడు. అప్పుడు రామచంద్ర వద్దు నాన్న మీరు ఏం పని చేయొద్దు.
 

ఈ వయసులో కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదు నాన్న అనగా ఇంట్లో ఖర్చులకు కాకపోయినా కనీసం నా మందుల ఖర్చులు కైనా వస్తాయి అంటాడు గోవిందరాజులు. నీ కొడుకులు నీకు మందులు కొనలేని స్థితిలో లేరు నాన్న ఒక్కొకరు ఒక పని చేసుకుంటున్నారు మందులు మేము తెచ్చి ఇస్తాము అని అంటాడు  రామ. పిల్లలు ఉన్నది ఆస్తులు పంచుకోవడానికి కాదు మామయ్య గారు ఆనందాలు పంచుకోడానికి కూడా అని అంటుంది జానకి. మాక్కూడా చెప్పకుండా మిల్ లో చేరారు అంటే మిమ్మల్ని సరిగా చూసుకోలేదని నాకు అనుమానం వస్తుంది నాన్న అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి తప్పు సరిదిద్దుకుంటాను అని అంటాడు రామచంద్ర. మీరు పని చేయాలనుకోవడం నాకు కూడా నచ్చలేదు అని చెప్పి జ్ఞానాంబ నుంచి వెళ్ళిపోతుంది.
 

ఆ తర్వాత జానకి వంట చేస్తూ ఉండగా రామచంద్ర భోజనం చేయడానికి వస్తాడు. ఇంతలోనే లడ్డుకు కావాల్సిన సామాగ్రి వాళ్ళు తెచ్చి ఇవ్వడంతో ఉదయానికల్లా 70 కేజీల లడ్డు ఎలా చేస్తారు అని మలయాళంతో నువ్వు ఉన్నావు కదా అని అంటుంది జానకి. దాంతో మలయాళం వంటలు రాక నేను ఏడుస్తుంటే లడ్డూలు చేయమంటున్నారు అంటూ వాళ్ళ మామయ్య ఫోటో చూస్తే తిట్టుకుంటూ ఉంటాడు మలయాళం. అప్పుడు మలయాళం మాటలకు వాళ్ళు సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. మరోవైపు మల్లిక,జానకి రామచంద్ర మాటలకు కోపంతో రగిలిపోతూ ఉండగా ఎందుకు మల్లిక ప్రతి దానికి ఇలా కుళ్ళు కుంటావు అని అంటాడు విష్ణు.
 

మీ నాన్న పని చేస్తే మీ వాళ్లకు ఏంటి నష్టం బాగానే ఉన్నాడు కదా అనగా ఆరోగ్యం బాగాలేదు కదా మల్లిక అనడంతో మూడు పూట్ల తిని గుండ్రాయి లాగా ఉన్నాడు కదా అంటుంది మల్లిక. అప్పుడు మల్లిక రేపు మీరు ఒకటో తారీకు రాగానే మీరు కూడా ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి అనడంతో మనము ఉంటున్నాం తింటున్నాం కదా అనడంతో మల్లిక డబ్బులు ఎలా ఇవ్వకుండా అది ఆలోచించండి డబ్బులు మనం ఇచ్చే ప్రసక్తే లేదు అని అంటుంది.. ఏం మాట్లాడకుండా ఉండటం నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అని అంటుంది. ఆ తర్వాత రామచంద్ర,జానకి,మలయాళం, వెన్నెల అందరూ కలిసి కష్టపడి లడ్డు చేస్తూ ఉంటారు. మలయాళం తిక్క తిక్కగా కామెడీ చేస్తూ ఉండగా అది చూసి నవ్వుకుంటూ ఉంటారు.
 

తర్వాత వెన్నెల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత జానకి రామచంద్రని కూడా రెస్ట్ తీసుకోమని చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది. అప్పుడు రామచంద్రం మలయాళం ఇద్దరు కలిసి లడ్డు చేస్తూ ఉండగా మలయాళం అలాగే పడుకొని నిద్రపోతాడు. జానకి ఒకటే లడ్డు చేస్తూ ఉండగా ఇంతలో గోవిందరాజులు అక్కడికి వస్తాడు. నేను కూడా సహాయం చేస్తాను అనగా వద్దులేండి మామయ్య మీరు వెళ్ళండి అని అంటుంది.

click me!