కాలంతో పాటు మనుషుల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది.తల్లిదండ్రులు కావడానికి మీనమేషాలు లెక్క పెడుతున్నారు. దీనికి ఒక పద్ధతి, ప్రణాళిక ఉండాలని చెబుతున్నారు. కాగా ఉపాసన-రామ్ చరణ్ వివాహం జరిగి పదేళ్లు దాటిపోయింది. అయినా వారు పిల్లల్ని కనలేదు. ఓ ఏడాది అటూ ఇటుగా పెళ్లి చేసుకున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరేసి పిల్లల్ని కన్నారు. అల్లు అర్జున్ కూతురైతే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది.