మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరో భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రారంభించారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ పూజా కార్యక్రమం ఇటీవల గ్రాండ్ గా జరిగింది. మెగా స్టార్ చిరంజీవి, డైరెక్టర్ శంకర్, అల్లు అరవింద్ అతిథులుగా హాజరయ్యారు. బుచ్చిబాబు, రాంచరణ్ తో పాటు ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాల్గొన్నారు.