కన్నుల పండుగలా శర్వానంద్ నిశ్చితార్థం.. అతిథులుగా హాజరైన రాంచరణ్, ఉపాసన దంపతులు..ఫోటోస్

First Published Jan 26, 2023, 12:23 PM IST

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో హీరో శర్వానంద్ ఒకరు. తాజాగా శర్వానంద్ ఇంట పెళ్లి భాజాలు మొదలయ్యాయి. శర్వానంద్ వివాహం, నిశ్చితార్థం గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే నేడు రిపబ్లిక్ డే రోజున హీరో శర్వానంద్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. 

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో హీరో శర్వానంద్ ఒకరు. తాజాగా శర్వానంద్ ఇంట పెళ్లి భాజాలు మొదలయ్యాయి. శర్వానంద్ వివాహం, నిశ్చితార్థం గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మేము కూడా ఆ వార్తలని తెలియజేశాం. అనుకున్నట్లుగానే నేడు రిపబ్లిక్ డే రోజున హీరో శర్వానంద్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. 

38 ఏళ్ల శర్వానంద్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నాడు. రక్షితా రెడ్డి అనే యువతితో శర్వానంద్ నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరి నిశ్చితార్థ వేడుక కనుల పండుగలా జరిగింది. ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో వెలిగిపోతున్నారు. 

శర్వానంద్, రక్షితరెడ్డి నిశ్చితార్థానికి టాలీవుడ్ క్రేజీ కపుల్ రాంచరణ్, ఉపాసన దంపతులు అతిథులుగా హాజరయ్యారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. రాంచరణ్, శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్స్.. చిన్ననాటి నుంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. 

శర్వానంద్, రక్షిత నిశ్చితార్థానికి రాంచరణ్, ఉపాసన పింక్ మ్యాచింగ్ డ్రెస్ లో హాజరయ్యారు. ఇక శర్వానంద్, రక్షిత రెడ్డి చిరునవ్వులు చిందిస్తూ పూలమాలలు ధరించి అందంగా అలరించారు. 

రక్షిత రెడ్డి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వర్క్ చేస్తోంది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా శర్వానంద్ కి రక్షితతో పరిచయం ఏర్పడిందట. అభిప్రాయాలు కలవడంతో ఫ్రెండ్ షిప్ మొదలుపెట్టి ప్రేమికులుగా మారారు. వెంటనే కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్ళికి పచ్చ జెండా ఊపారు. రక్షిత పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న అమ్మాయి. 

ఆమె తండ్రి తెలంగాణ హైకోర్టులో లాయర్ గా పనిచేస్తున్నారు. అలాగే ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి మనవరాలు.  మొత్తానికి శర్వానంద్ బలమైన బ్యాగ్రౌండ్ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు నిశ్చితార్థం పూర్తయింది కాబట్టి పెళ్లి కూడా త్వరలోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ లో వివాహం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కొన్ని వారాల క్రితం శర్వానంద్ బాలయ్య అన్ స్టాపబుల్ షోకి అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ షోలో బాలయ్య శర్వాని పెళ్ళెప్పుడు అని ప్రశ్నించగా.. ప్రభాస్ పెళ్లి తర్వాత అని సరదాగా బదులిచ్చాడు. 

అయితే ప్రభాస్ కి కూడా అన్ స్టాపబుల్ లో ఇదే ప్రశ్న ఎదురైంది. ప్రభాస్ పెళ్లి ఈ ఏడాదే ఉండబోతున్నట్లు రాంచరణ్, గోపీచంద్ ఈ షోలో హింట్ ఇచ్చారు. ఏది ఏమైనా ఈ ఏడాది టాలీవుడ్ లో చాలా మంది బ్యాచిలర్ హీరోలు పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా శర్వానంద్ చివరగా ఒకే ఒక జీవితం అనే టైం ట్రావెల్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది.   

click me!