తెలుగు సినిమాలపై రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్.. అందుకే చేయట్లేదంటూ క్లారిటీ!

First Published Dec 4, 2022, 1:40 PM IST

రెండేండ్లుగా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్ వైపు కన్నెత్తి చూడటం లేదు. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది.
 

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) కొన్నేండ్లు దుమ్ములేపింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ అగ్రస్థాయి హీరోయిన్లలో చేరిపోయింది. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది.
 

ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. ఎప్పటి నుంచో మధ్య మధ్యలో హిందీ సినిమాల్లో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. గతేడాది నుంచి పూర్తిగా నార్త్ లోనే పాతుకుపోయింది. ఫలితంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
 

దీంతో రకుల్ అభిమానులు కాస్తా అప్సెట్ అవుతున్నారు. మళ్లీ తెలుగు సినిమాల్లో నటించేదెప్పుడంటూ సోషల్ మీడియా వేదికన రకుల్ ను ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్టార్ హీరోయిన్ తాజాగా స్పందించింది. ఎందుకు ఇక్కడ సినిమాలు చేయడం లేదో తెలిపింది.
 

ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడిన రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగులో సరైన సినిమాలు రావడం లేదని.. అందుకే నటించడం లేదని తెలిపింది. తెలుగు ప్రేక్షకులంటే తనకూ ఎప్పుడూ ప్రత్యేకమైన అభిమానం ఉంటుందని చెప్పుకొచ్చింది.
 

తాను ప్రస్తుతం ముంబైలో ఉండటంతో తెలుగు ఆడియెన్స్ ను చాలా మిస్ అవుతున్నట్టు కూడా చెప్పింది. ఇప్పటికీ తెలుగు సినిమాల్లో నటించాలని ఉందంది. ఇక బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలతో అలరించింది. అయితే వాటి ఫలితాలు సానుకూలంగా లేకపోయాయి.

బాలీవుడ్ లో రకుల్ కు ఫ్లాప్స్ రావడంతో.. మళ్లీ సౌత్ వైపే మొగ్గు చూపనుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే తమిళ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఇండియన్ 2’లో రకుల్ నటిస్తోంది. ఈ మూవీతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందని అభిమాను ఆశిస్తున్నారు.  

click me!