Rakul Wedding Pics: ప్రియుడిని పెళ్లాడిన రకుల్ ప్రీత్ సింగ్..చూడ ముచ్చటగా జంట, ఫోటోలు వైరల్

First Published Feb 21, 2024, 9:41 PM IST

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్.. మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ లాంటి టాప్ స్టార్స్ తో నటించింది. కొంతకాలం రకుల్ టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవించింది. 

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్.. మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ లాంటి టాప్ స్టార్స్ తో నటించింది. కొంతకాలం రకుల్ టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవించింది. కానీ ఒక్కసారిగా ఆమెకి అవకాశాలు పడిపోయాయి. బాలీవుడ్ లో కూడా రకుల్ కి కలసి రాలేదు.   

ఇదిలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ ఎట్టకేలకు తన ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడింది. గోవాలో వీరిద్దరి పెళ్లి వేడుక నేడు అంగరంగ వైభవంగా జరిగింది. సాంప్రదాయ వస్త్ర ధారణలో రకుల్, జాకీ భగ్నానీ మెరిసిపోతున్నారు. 

వీళ్లిద్దరి వెడ్డింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రకుల్ పింక్ కలర్ లెహంగాలో ఎంతో అందంగా ముస్తాబైంది. నవ వధూవరులు ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ పెళ్లి పీటలపై ఉన్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో రకుల్ వివాహం గ్రాండ్ గా జరిగింది. 

పెళ్లి అనంతరం రకుల్, జాకీ భగ్నానీ మీడియా ముందు కూడా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. రకుల్ పై జాకీ భగ్నానీ ముద్దులు కురిపిస్తున్నాడు.  బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉంది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు.

రకుల్, జాకీ భాగాన్ని తమ పెళ్లి వేడుక కోసం ఐటిసి గ్రాండ్ గోవా రిసార్ట్ ని ఎంచుకున్నారు. ఈ లగ్జరీ రిసార్ట్ మొత్తం 45 ఎకరాల్లో ఉంటుంది. మొత్తం 246 రూమ్స్ రూమ్స్ ఉన్నాయట. ఒక్కో రూమ్ రెంట్ 19 వేల నుంచి 75 వేల వరకు ఉంటుందని  చెబుతున్నారు. 

బీచ్ పక్కనే ఎంతో అందంగా ఈ రిస్టార్ ని నిర్మించారు. ఇండియా పోర్చుగీస్ విలేజ్ స్టైల్ లో రిసార్ట్ ని నిర్మించినట్లు తెలుస్తోంది. రిసార్ట్ నుంచి నేరుగా బీచ్ లొకేషన్ కి వెళ్లొచ్చు. 

మొత్తంగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చాలా గ్రాండ్ గా.. ఎలాంటి పొల్యూషన్ కి తావులేకుండా జరిగింది. చాలా మంది నటీమణులు 35 ప్లస్ అయినప్పటికీ వివాహానికి దూరంగా ఉన్నారు. 

కానీ రకుల్ 33 ఏళ్ళ వయసులో తన ప్రియుడిని పెళ్లాడింది. రకుల్ వివాహం తర్వాత కూడా యాక్టింగ్ కొనసాగించనుంది. రకుల్, జాకీ భగ్నానీ వెడ్డింగ్ కోసం ముగ్గురు డిజైనర్లు పనిచేశారు. 

సబ్యసాచి, తరుణ్ తహిల్యాని, మనీష్ మల్హోత్రా ఇలా ముగ్గురు డిజైనర్లు రెడీ చేసిన వస్త్రాలు ధరించి రకుల్, జాకీ కనిపించారు.   రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. 

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం కొన్ని చిత్రాలకు కమిటై ఉంది. వెడ్డింగ్ తర్వాత రకుల్, జాకీ భగ్నానీ జంట హనీ మూన్ కి వెళ్లనున్నట్లు సమాచారం. తిరిగి వచ్చిన అనంతరం రకుల్ తన చిత్రాలతో బిజీ అవుతుంది. 

click me!