రజనీకాంత్ ప్రస్తుతం `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. శివ కుమార్ దర్శకుడు. నయనతార, కీర్తిసురేష్, జగపతిబాబు, ఖుష్బు, మీనా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
undefined
కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ఇటీవల తిరిగి షూటింగ్ని ప్రారంభించారు. ఇందులో రజనీ, నయనతార, జగపతిబాబు ఇలా ప్రధాన తారాగణం పాల్గొంది. రజనీ, జగపతిబాబుపై పలు యాక్షన్ సీన్స్, అలాగే నయనతార, రజనీల మధ్య పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తుంది. దాదాపు 35 రోజులుగా ఈ హైదరాబాద్ షెడ్యూల్ జరిగింది.
undefined
ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబర్లో హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అస్వస్థతకి గురైన విషయం తెలిసిందే. సెట్లో కొంత మందికి కరోనా సోకడంతో షూటింగ్ని నిలిపివేశారు. ఆ తర్వాత చాలా రోజుల గ్యాప్తో తిరిగి ఇటీవల ప్రారంభించి హైదరాబాద్ షెడ్యూల్ని పూర్తి చేశారు.
undefined
మంచి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాని సన్ పిక్చర్ సంస్థ నిర్మిస్తుంది. దీపావళి సందర్బంగా సినిమాని విడుదల చేయబోతున్నారు.
undefined
హైదరాబాద్ నుంచి ప్రైవేట్ జెట్లో చెన్నై వెళ్లిన రజనీ నేరుగా ఇంటికెళ్లారు. ఇంటి వద్ద ఆయన భార్య లతా రజనీకాంత్ ఆయనకు హారతి పట్టి ఇంట్లోకి ఆహ్వానించింది.
undefined
ఇక రజనీ ఇంటికి చేరుకున్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు చాలా మంది ఇంటికి చేరుకున్నారు. వారందరికి రజనీ అభివాదం చేయడం విశేషం.
undefined