థియేటర్లో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో ఈ చిత్రాన్ని ఆస్వాదించే అవకాశం పొందనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మించగా, రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. శృతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, లోకేష్ కనగరాజ్ తన ప్రత్యేక శైలిలో కథను మలిచారు.