ఆ ప్రశ్న అడగగానే మండిపోయింది రజనీకి, సీరియస్ గా వార్నింగ్

First Published Sep 20, 2024, 5:04 PM IST

ప్రశ్న అడగగానే   అసహనం వ్యక్తంచేస్తూ అక్కడినుంచి  రజనీకాంత్ వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
 

రజనీకాంత్ ఎప్పుడో కానీ తన ఎమోషన్స్ ని బహిరంగంగా బయిటపడనివ్వరు. అయితే ఆయనకు ప్రస్టేషన్ వచ్చింది. రాజకీయాల గురించి ప్రశ్నించిన విలేకరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు  రజనీకాంత్‌ (Rajinikanth). తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఆయన్ని తమిళనాడు ప్రస్తుత రాజకీయాల గురించి ఓ విలేకరి ప్రశ్నించాడు. 
 

Rajanikanth


తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్‌ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అని అడగ్గా.. ‘‘రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు నన్ను అడగవద్దు అని చెప్పానుగా’’ అని అసహనం వ్యక్తంచేస్తూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Latest Videos



డీఎంకే (DMK) అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (MK Stalin), తన తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు (Udhayanidhi stalin) ఉప ముఖ్యమంత్రి పదవి పగ్గాలు అప్పగిస్తారని అధికార డీఎంకేలో కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

దీనిపై ఇటీవల ఉదయనిధి స్టాలిన్‌ స్పందిస్తూ.. ‘ఇది పూర్తిగా ముఖ్యమంత్రికి సంబంధించిన విషయం. ఆయన మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయం’ అని చెప్పారు. తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి మంత్రి, డీఎంకే పార్టీ యూత్‌ వింగ్‌ సెక్రటరీగా ఉదయనిధి కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Rajanikanth


రజనీకాంత్‌ ప్రస్తుత  సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘వేట్టయాన్‌’, ‘కూలీ’ కోసం వర్క్‌ చేస్తున్నారు. టి.జె.జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్న ‘వేట్టయాన్‌’లో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషించారు.

లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఇది నిర్మితమవుతోంది. అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్నారు. అక్టోబర్‌ 10న ఇది విడుదల కానుంది. ‘కూలీ’ చిత్రానికి లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున, శ్రుతిహాసన్‌, సత్యరాజ్‌, ఉపేంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Rajanikanth

థానాయకుడు రజనీకాంత్‌ సినిమాల విషయంలో జోరు ప్రదర్శిస్తున్నారు. ఈ దసరా బరిలో ‘వేట్టయాన్‌’తో సందడి చేయనున్న ఆయన.. ఆ వెంటనే ‘కూలీ’తో పలకరించనున్నారు.

ఇది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు ‘జైలర్‌ 2’ను పట్టాలెక్కించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. అయితే ఇప్పుడాయన మరో కథ విషయమై ఓ యువ దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

‘కర్ణన్‌’, ‘మామన్నన్‌’ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు మారి సెల్వరాజ్‌. ఆయన ప్రస్తుతం రజనీతో ఓ సినిమా చేసేందుకు కథా చర్చలు జరుపుతున్నట్లు స్వయంగా వెల్లడించారు. ‘‘రజనీకు నేనంటే ఇష్టం. నా గత చిత్రాలు ‘కర్ణన్‌’, ‘మామన్నన్‌’ చూసి ఫోన్‌ చేసి అభినందించారు.

మేమిద్దరం కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి కథా చర్చలు జరుగుతున్నాయి’’ అని తెలిపారు సెల్వరాజ్‌. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన ‘వాజై’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘బైసన్‌’ 70శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

click me!