అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో లాంటి చిత్రాల్లో కలసి నటించిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పుష్ప 2పై ఆ మధ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల వస్తున్న చిత్రాలు చాలా దారుణంగా ఉంటున్నాయి అని చెప్పే క్రమంలో.. వాడెవడో ఎర్ర చందనం దొంగ అంట.. వాడిని కూడా హీరోగా చూపించారు అంటూ పుష్ప 2పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి.