ఈ క్రమంలో వాడెవడో చందనం దొంగ వాడు హీరో అంటూ నోరు జారాడు రాజేంద్రప్రసాద్. కానీ ఆయన రెగ్యూలర్గానే మాట్లాడుతూ వెళ్లిపోయారు. అంతేకాదు తనపై తాను కూడా విమర్శలు చేసుకున్నారు. హీరోల్లో మీనింగ్లు మారిపోయాయని తెలిపారు.
`లేడీస్ టైలర్ వాడు హీరోనా, వాడు పెద్ద సన్నాసి, అప్పుల అప్పారావు హీరోనా, పేకాట పాపారావు హీరో, ఏప్రిల్ ఒకటో తారీఖలు వాడు పెద్ద దొంగ వాడు హీరోనా, కానీ మన సమాజంలో మన చుట్టూ, మన పక్కనే ఉన్న పాత్రలను తీసుకుని హీరోగా నటించి మెప్పు పొందాను అని తెలిపారు రాజేంద్రప్రసాద్.