రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పూర్వీకుల గురించి చెబుతూ ఇలాంటి వంశంలో పుట్టినందుకు సిగ్గుగా ఉంది అని అన్నారు. ఎందుకు అలా అన్నారో ఈ కథనంలో తెలుసుకోండి.
పాన్ ఇండియా రచయిత విజయేంద్ర ప్రసాద్ గురించి పరిచయం అవసరం లేదు. రాజమౌళి సినిమాలకు మాత్రమే కాకుండా అనేక సూపర్ హిట్ చిత్రాలకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథలు అందించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, భజరంగీ భాయీజాన్ లాంటి పాన్ ఇండియా సినిమాలకు కథలు అందించడంతో విజయేంద్ర ప్రసాద్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.
25
సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం ఆయన రాజమౌళి వారణాసి చిత్రానికి కథ అందిస్తున్నారు. తాజాగా విజయేంద్ర ప్రసాద్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దళితుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితుల పట్ల ఉన్న వివక్ష గురించి విజయేంద్ర ప్రసాద్ ఓపెన్ గా కామెంట్స్ చేయడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
35
తన దళిత స్నేహితుడి గురించి చెబుతూ..
విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ డయాస్ ని ఓ విషయం మాట్లాడేందుకు వాడుకుంటున్నా. మాది చాలా సంపన్న కుటుంబం. నేను చదువుకునే రోజుల్లో నా క్లాస్ మేట్ పేరు జాన్ ఫెడిరిక్ సుందర్ రావు. దళిత కులానికి చెందిన అబ్బాయి. నాతో పాటు సమానంగా బాగా చదివేవాడు. మా నాన్న గారు ఆఅబ్బాయికి ఆర్థిక సహాయం చేశారు. ఎస్ఎస్సి తర్వాత ఇద్దరం ఒకే కాలేజీలో చేరాం. మా నాన్నకి కుల వివక్ష లేదు. నేను కూడా అలాంటి తప్పు ఎప్పుడూ చేయలేదు.
కానీ మా తాతలు, ముత్తాతలకు కుల వివక్ష ఉంది. వాళ్ళు నోటితో చెప్పలేని ఘోరాలు కుల వివక్ష రూపంలో చేశారు. ఆది తలుచుకున్నప్పుడు నా మనసు సిగ్గుతో, అవమానంతో కుంగిపోతుంది. ఛీ ఇలాంటి వంశంలో పుట్టానా అని అనిపించింది. కానీ ఆ తప్పులో నాకు కూడా భాగం ఉంది. మా పూర్వీకుల జీన్స్ నాకు ఉంది. వారి ఆస్తులు అనుభవిస్తున్నా.
55
క్షమించండి అని వేడుకుంటున్నా
అందుకే మీ అందరి ముందు తలవంచి వినయంగా క్షమించండి అని వేడుకుంటున్నా అంటూ విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేశారు. కుల వివక్ష గురించి విజయేంద్ర ప్రసాద్ ఇంత ఓపెన్ గా మాట్లాడడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.