రష్యన్ బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ ‘పుష్ప’ మాసీవ్ కౌంటింగ్.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

Published : Jan 02, 2023, 03:12 PM ISTUpdated : Jan 02, 2023, 03:16 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప : ది రైజ్’ గతనెలలో రష్యన్ లాంగ్వేజీలో విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తాజాగా 25 రోజులకు సంబంధించిన కలెక్షన్ వివరాలను మేకర్స్ విడుదల చేశారు.   

PREV
16
రష్యన్ బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ ‘పుష్ప’ మాసీవ్ కౌంటింగ్.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘పుష్ప : ది రైజ్’. 2021 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. పుష్పరాజ్ మేనరిజం, ‘తగ్గేదే లే’ లాంటి డైలాగ్స్, సాంగ్స్ ఎంతలా ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 

26

ముఖ్యంగా స్టార్ క్రికెటర్స్ కూడా ‘పుష్పరాజ్’ మేనరిజాన్ని ఫాలో అవడంతో ప్రపంచ వ్యాప్తంగా సినిమాకు క్రేజ్ దక్కింది. దీంతో రష్యాలో గతేడాది డిసెంబర్ 8న రష్యన్ వెర్షన్ లో Pushpa The Riseను రిలీజ్ చేశారు. అప్పటి నుంచి చిత్రం అక్కడి థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది.

36

నెమ్మదిగా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూ ప్రస్తుతం దూసుకుపోతోంది. 25 రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్  ‘పుష్ప : ది రైజ్’ రష్యన్ వెర్షన్ కలెక్షన్స్ ను ప్రకటించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూకుడుగా వ్యవహరిస్తోందని తెలిపారు. 

46

రష్యాలో ‘ఫుష్ప : ది రైజ్’ ప్రస్తుతం 774 స్క్రీన్‌లలో విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. 25 రోజుల్లో 10 మిలియన్ (కోటీ) రూబుల్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టిందని.. ఇంకా కౌంటింగ్ వేగంగా జరుగుతోందని వెల్లడించారు. 
 

56

పుష్ప: ది రైజ్ కు విడుదలైన ఏడాది తర్వాత కూడా ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయంగానూ క్రేజ్ దక్కుతుండటం విశేషం. మూడు వారాల వరకు కాస్తా ఇబ్బందిగానే సాగినా.. ప్రస్తుతం మాత్రం రష్యన్లకు అత్యంత ఇష్టమైన భారతీయ చలనచిత్రంగా మారిందని తెలుస్తోంది. మున్ముందు మరింతగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. 

66

అల్లు అర్జున్ ప్రస్తుతం వేకేషన్ లో ఉన్నారు. తిరిగి రాగానే ‘పుష్ప : ది రూల్’ (Pushpa 2) రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని.. పోస్టర్ డిజైనింగ్ కు సంబంధించిన ఫొటోషూట్ ను కూడా పూర్తి చేశారు. ‘పుష్స2’ను రూ.350 కోట్లతో మరింత గ్రాండ్ గా తెరకెక్కించనున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ మరోసారి మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు.
 

Read more Photos on
click me!

Recommended Stories