ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ ఒడిషాలోని మల్కన్ గిరి జిల్లాలో జరగబోతున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. త్వరలో షూట్ ప్రారంభం కానుంది. చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక. ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.