నువ్వెంత కష్టపడ్డావో మాకు తెలుసు, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్న.. పూరి కుమార్తె ఎమోషనల్ కామెంట్స్

First Published Aug 26, 2022, 10:37 AM IST

పూరి జగన్నాధ్ ముద్దుల కుమార్తె పవిత్ర పూరి చేసిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ చిత్రంపై సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఒకప్పుడు పూరి జగన్నాధ్ సినిమా అంటే.. ఎలా ఉన్నా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ.. వసూళ్లు పక్కా అన్నట్లుగా వ్యవహారం ఉండేది. కానీ క్రమంగా ఆ పరిస్థితి మారుతోంది. 

లైగర్ చిత్రంతో పూరి జగన్నాధ్ విమర్శలని మూటగట్టుకున్నారు. కథాకథనాలు గాలికి వదిలేయడంతో కేవలం సాంగ్స్, ఫైట్స్ అన్నట్లుగా సినిమా సాగింది. దీనితో లైగర్ చిత్రాన్ని నెటిజన్లు ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. పూరి జగన్నాధ్ ముద్దుల కుమార్తె పవిత్ర పూరి చేసిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 

లైగర్ రిలీజ్ సందర్భంగా పవిత్ర పూరి తన తండ్రి గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఇది బిగ్ డే.. ఈ చిత్రం కోసం నువ్వు ఎంత కష్టాడ్డావో మాకు తెలుసు. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఇది నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ. నిన్ను చూసినప్పుడల్లా గర్వంగా అనిపిస్తుంది. అలాగే ఇంట్లో ప్రతి రోజు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాం. 

అవకాశాలు అందిపుచ్చుకోవడానికి రిస్క్ తీసుకోవడం అవసరం అని నీ నుంచే నేర్చుకున్నాం. ఈ చిత్రం కోసం మీ టీం మొత్తం ఎంతో స్ట్రగుల్ అనుభవించింది. లైగర్ చిత్రం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వే నా బలం బలహీనత నాన్న అంటూ పవిత్ర పూరి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 

లైగర్ రిలీజ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ పవిత్ర ఇంస్టాగ్రామ్లో ఈ పోస్ట్ పెట్టింది. దురదృష్టవశాత్తూ లైగర్ చిత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఇదిలా ఉండగా పూరి జగన్నాధ్ తన కుమర్తెని సినిమాల్లో నిర్మాణ రంగంలోకి తీసుకురాబోతున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. 

పవిత్ర పూరికి సినిమాలపై ఆసక్తి బాగా ఉందట. పూరి జగన్నాధ్ తన సొంత ప్రొడక్షన్ లో నిర్మించి దర్శకత్వం వహించిన లైగర్ మూవీ ఇలాంటి రిజల్ట్ ఇస్తుందని ఎవరూ ఊహించలేదు. 

click me!