త్రివిక్రమ్ నిర్ణయంతో కోట్లు నష్టపోయిన మహేష్ నిర్మాత... ఇప్పుడిదే హాట్ టాపిక్!

First Published Nov 30, 2022, 4:33 PM IST

త్రివిక్రమ్-మహేష్ మూవీ కారణంగా నిర్మాత కోట్లలో నష్టపోయాడంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. ఒక షెడ్యూల్ చేశాక ప్రణాళికలు మారడంతో కోట్ల ఖర్చు బూడిదలో పూసిన పన్నీరు అయ్యిందంటున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ తన 28వ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. పలు కారణాలతో మూవీ సమయానికి సెట్స్ పైకి వెళ్ళలేదు. ఒక దశలో ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. స్క్రిప్ట్ పట్ల సంతృప్తిగా లేని మహేష్ మార్పులు సూచించారన్న కథనాలు వెలువడ్డాయి. 
 

అయితే ఊహాగానాలు పటాపంచలు చేస్తూ... ఇటీవల మూవీ రెగ్యులర్ షూట్ స్టార్ అయ్యింది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్స్లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ కూడా అర్థాంతరంగానే ముగించారని సమాచారం. అప్పుడు త్రివిక్రమ్ కొత్త ఆలోచనలు చేశాడట. పాన్ ఇండియా మూవీగా విడుదల చేద్దామని మహేష్ తో సూచించారట. ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారట. 
 

మరి పాన్ ఇండియా మూవీ అంటే ప్రమాణాలు పెంచాలి. అన్ని భాషల ఆడియన్స్ కి సెట్ అయ్యేలా యూనివర్సల్ హంగులు అద్దాలి. ఈ క్రమంలో స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేశారు. దీంతో ఫస్ట్ షెడ్యూల్ లో చేసిన షూట్ ఎందుకూ పనికి రాకుండా పోయిందట. మొదట అనుకున్న ప్రకారం షూట్ కి అవసరమైన భారీ సెట్స్ వేశారు. అలాగే షెడ్యూల్ రెండు మూడు వారాలు జరిపారు. 


స్టార్ హీరో సినిమా అంటే ఒక రోజుకు కోటి రూపాయల పైనే ఖర్చు ఉంటుంది. మొత్తంగా త్రివిక్రమ్-మహేష్ తమ నిర్ణయం కారణంగా నిర్మాత సూర్యదేవర నాగ వంశీకి కోట్లలో నష్టం తెచ్చారని అంటున్నారు. ఈ ప్రచారంలో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తోంది. 
 

అలాగే ఈ చిత్రంలో నటి శోభనను మహేష్ తల్లి పాత్ర కోసం తీసుకుంటున్నారట. శోభన తెలుగులో నటించి దశాబ్దం దాటిపోతుంది. 2006లో మహేష్ బాబు-మంచు విష్ణు కాంబోలో తెరకెక్కిన గేమ్ మూవీలో శోభన నటించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా... శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా ఎంపికయ్యారట.

click me!