లవ్ టుడే చిత్రంతో తమిళ నటుడు ప్రదీప్ రంగనాథ్ తెలుగులో కూడా గుర్తింపు సొంతం చేసుకున్నారు. యువతకి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉన్న కథలని ప్రదీప్ ఎంచుకుంటున్నారు. ప్రదీప్, అనుపమ పరమేశ్వరన్, కాయడు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ' డ్రాగన్' ఫిబ్రవరి 21న రిలీజ్ అవుతోంది. దీనితో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది.