త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబో మూడోసారి సెట్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా పూర్తి కాకుండానే.. అప్పుడే ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడు పోవడం విశేషం. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. ఇక చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నారు. అన్నీ భాష రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.