ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ వైజయంతి బ్యానర్ పై రూ.500 కోట్లతో ‘ప్రాజెక్ట్ కే’ను రూపొందిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) జంటగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. సీ అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, హిందీలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లిష్ లోనూ రిలీజ్ చేయబోతున్నారు.