చుట్టూ బాడీ గార్డ్స్, మహేష్ కోసం లాస్ ఏంజిల్స్ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన గ్లోబల్ బ్యూటీ

Published : Jan 17, 2025, 07:19 AM IST

గ్లోబల్ సెన్సేషన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. లాస్ ఏంజిల్స్ నుంచి ఆమె హైదరాబాద్ కి వచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో  తెరకెక్కబోయే భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

PREV
14
చుట్టూ బాడీ గార్డ్స్, మహేష్ కోసం లాస్ ఏంజిల్స్ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన గ్లోబల్ బ్యూటీ

గ్లోబల్ సెన్సేషన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. లాస్ ఏంజిల్స్ నుంచి ఆమె హైదరాబాద్ కి వచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో  తెరకెక్కబోయే భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రాజమౌళి ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

24

అందుకే కాస్టింగ్ కూడా అదే స్థాయిలో ఉండేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా బాలీవుడ్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హాలీవుడ్ లో సైతం సత్తా చాటింది. ప్రియాంక చోప్రా అయితే ఈ చిత్రానికి బావుంటుందని రాజమౌళి ఆమెని ఎంపిక చేశారు. అంతకు ముందు కొందరు మలేషియన్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి కానీ చివరికి జక్కన ప్రియాంక చోప్రా వైపే మొగ్గు చూపారు. 

34

ఇప్పుటికే ఆలస్యం కావడంతో వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు పెట్టాలని రాజమౌళి భావిస్తున్నారు. ఇటీవల సీక్రెట్ గా మూవీ లాంచ్ కూడా జరిగింది. తాజాగా ప్రియాంక చోప్రా.. రాజమౌళి, మహేష్ బాబుతో ఈ చిత్ర చర్చల్లో పాల్గొనేందుకు లాస్ ఏంజిల్స్ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. చుట్టూ బాడీ గార్డులతో ఆమె హైదరాబాద్ లో అడుగు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

44

రాజమౌళి, మహేష్ బాబు చిత్రం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కనుంది. ఆఫ్రికన్ రచయిత విల్బర్ స్మిత్ రచించిన నవల ఆధారంగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సాహస వీరుడిగా కనిపిస్తారు. 

click me!

Recommended Stories