ఓ ప్రముఖ ఛానల్ ఇన్వెస్టింగేషన్ ప్రకారం ఈ వివాదంపై ముస్తాఫాతో పాటు ఆయన మొదటి భార్య అయేషా స్పందించారు. వారిద్దరి వాదనల ప్రకారం మొదటి భార్యతో ముస్తఫా చట్ట పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని అర్థం అవుతుంది.
undefined
మొదటగా ముస్తాఫా మొదటి భార్య అయేషాను మీడియా సంప్రదించగా, ప్రియమణి, ముస్తాఫా వివాహం చెల్లదని సంచలన ఆరోపణలు చేశారు. ముస్తఫా, ప్రియమణిపై క్రిమినల్ కేసులు పెట్టినట్లు, అవి కోర్టులో నడుస్తున్నట్లు వెల్లడించారు.
undefined
అయేషాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో అయేషా ముస్తఫా పై గృహ హింస కేసు పెట్టారు. అనంతరం వీరు విడిపోవడం జరిగింది. 2017లో ముస్తఫా ప్రియమణిని వివాహం చేసుకోవడం జరిగింది.
undefined
ముస్తాఫా, నేను అధికారికంగా విడిపోలేదు. కనీసం విడాకులకు కూడా అప్లై చేయలేదు. ఇంతలోనే ప్రియమణిని ఆయన వివాహం చేసుకున్నారు. కాబట్టి ఈ వివాహం చెల్లదు. ముస్తఫాకు నేను ఇప్పటికీ భార్యనే, కోర్ట్ లో తాను రెండో వివాహం చేసుకోలేదని ముస్తఫా చెబుతున్నారని అయేషా తెలిపారు.
undefined
అయేషా వివాదం గురించి ముస్తఫాను సంప్రదించగా... నాపై చట్టబద్దమైన చర్యలు అనేవి నిజం కాదు. ఇద్దరు పిల్లల పోషణకు అవసరమైన డబ్బులు నేను రెగ్యులర్ గా పంపిస్తున్నాను. కానీ అయేషా మోసపూరితంగా నా వద్ద నుండి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది, అన్నారు.
undefined
ముస్తఫా ఇంకా మాట్లాడుతూ 2010 నుండే నేను అయేషా విడివిడిగా ఉంటున్నాం. 2013లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాం. 2017లో ప్రియమణితో నాకు వివాహం జరిగింది. మరి ఇన్నేళ్లు ఆమె ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. అలాగే ఈ న్యూస్ రిపోర్ట్ చేయవద్దని ముస్తాఫా మరీమరీ అడిగారు.
undefined
ఇద్దరు పిల్లల తల్లిగా న్యాయం కోసం, మౌనంగా ఎదురు చూసినట్లు అయేషా చెప్పడం విశేషం. ఇక ఈ కేసులో ముస్తాఫా తరపున వాదిస్తున్న లాయర్ పూర్ణిమ భాటియాను సంప్రదించగా, ప్రియమణి, ముస్తఫా లపై అయేషా న్యాయపోరాటం నిజమే అని నిర్ధారణ చేశారు.
undefined
దీనితో ప్రియమణి, ముస్తఫా మొదటి భార్య అయేషా నుండి చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని స్పష్టం అయ్యింది. ఇటీవల ఇంటర్వ్యూలలో ప్రియమణి భర్త ముస్తాఫా గురించి గొప్పగా వర్ణించిన విషయం తెలిసిందే.
undefined