ప్రభాస్ ను ప్రేమించి.. 40 ఏళ్లు వచ్చినా పెళ్ళి చేసుకోని ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

First Published Oct 23, 2024, 5:32 PM IST

ప్రభాస్ అంటే ప్రేమతో.. ప్రభాస్ నే నమ్మకుని.. పెళ్ళి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ను గడుపుతున్న ఇద్దరు హీరోయిన్లు ఎవరో మీకు తెలుసా..? 
 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఏజ్ బార్ అవుతున్నా పెళ్ళి మాత్రం చేసుకోవడంలేదు. చాలామంది యంగ్ స్టార్స్ పెళ్ళెప్పుడు అంటే.. ప్రభాస్ చేసుకున్నాక అని సరదాగా చెపుతుంటారు. మరి ప్రభాస్ ను ఇలా అని  అడిగితే.. నేను సల్మాన్ ఖాన్ చేసుకున్నాక చేసుకుంటాను అని కౌంటర్ కూడా ఇచ్చేశాడు. రీసెంట్ గా ప్రభాస్ కు 45 ఏళ్ళు వచ్చాయి. 

అయినా ఇంకా పెళ్ళి చేసుకోలేదు. ఎప్పుడు చేసుకుంటాడో క్లారిటీ కూడా లేదు. ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు. కాని  అన్ని ప్రశ్నలకు సమాధానం చెపుతాడు కాని.. పెళ్లి ప్రశ్నలను మాత్రం దాటవేస్తూ వస్తున్నాడు. ఇక ప్రభాస్ పెళ్ళి చేసుకుంటాడన్న నమ్మకం ఫ్యాన్స్ లో పోయింది. కాగా ప్రభాస్ మాత్రం సినిమాలపైనే పుల్ కాన్సంట్రేషన్ పెట్టేశాడు. 

Latest Videos


బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ.. సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. కాగా ఈమధ్య కూడా ప్రభాస్ పెళ్లికి సబంధించిన ఓ న్యూస్ వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు తాగాజా ప్రభాస్ ను ప్రేమించిన ఇద్దరు హీరోయిన్లకు సంబంధించిన వార్త హైలెట్ అవుతోంది. అదేంటంటే.. ప్రభాస్ ను నమ్మకుని.. ప్రభాస్ ను ప్రేమిస్తూ.. ప్రభాస్ లాగే బ్యాచిలర్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు ఇద్దరు స్టార్ హీరోయిన్లు. 
 

ఈయితే వారు ప్రభాస్ ను ప్రేమించారో లేదో తెలియదు కాని.. 40 ఏళ్ళుదాటినా.. బ్యాచిలర్స్ గానే మాత్రం ఉన్నారు. ఇంతకీ ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరంటే.. త్రిష, అనుష్క. అవును ఈ ఇద్దరు హీరోయిన్లు ప్రభాస్ తో ప్రేమలో పడ్డారట. బ్యాచిలర్లుగానే ఇప్పిటకీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. 

అయితే వీరిలో అనుష్క తో ప్రభాస్ పెళ్లి అంటూ చాలా కాలం న్యూస్ వైరల్ అయ్యింది. అమెరికాలో ఇల్లు కూడా కొన్నారు పెళ్ళి తరువాత జంప్ అంటూ రూమర్స్ వచ్చాయి. అంతే కాదు గ్రాఫిక్స్ లో వీరి ఫోటోలకు పెళ్ళి చేసి.. సోషల్ మీడియాలో వైరల్ కూడా చేశారు. కాని వీరు మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. ఇక ప్రభాస్.. అనుష్క ఇద్దరు కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 సినిమాల్లో నటించి మెప్పించారు. 
 

ప్రభాస్‌తో..

ఇక త్రిష కూడా ప్రభాస్ ను ప్రేమించిందని టాక్. 41 ఏళ్ళు వచ్చినా పెళ్ళి చేసుకోలేదు త్రిష. ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉంది. హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఏకైక తార త్రిష. ప్రభాస్ తో కలిసి ఆమె వర్ష, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో నటించింది. ఇక ప్రస్తుతం తమిళ, మళయాల, తెలుగుసినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో నటిస్తోంది త్రిష.  

click me!