ప్రస్తుతం ప్రభాస్ `ది రాజాసాబ్` మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇది ప్రభాస్ కెరీర్లోనే మొదటిసారిగా హర్రర్ ప్రధానంగా తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషం.
రొమాంటిక్ హర్రర్ ఫాంటసీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు మారుతి. తన మార్క్ కామెడీ ఇందులో హైలైట్ గా ఉండబోతుందట.
సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, రొమాన్స్ పరంగా కొదవలేదని, ఇటీవల కాలంలో ప్రభాస్ నుంచి మిస్ అయిన రొమాన్స్ ఇందులో చూడొచ్చు అని మారుతి తెలిపారు.
డిసెంబర్ 5న మూవీ విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన పాటలు, కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉందని, అది కంప్లీట్ చేసే పనిలో ప్రభాస్ ఉన్నారట.