'ఆదిపురుష్' ఎఫెక్ట్ తో వెనక్కి తగ్గిన ప్రభాస్.. తన స్నేహితుల విషయంలో కీలక పరిణామం

Published : Aug 05, 2023, 03:59 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. కానీ బాహుబలి అంతటి విజయం మాత్రం దక్కడం లేదు.

PREV
16
'ఆదిపురుష్' ఎఫెక్ట్ తో వెనక్కి తగ్గిన ప్రభాస్.. తన స్నేహితుల విషయంలో కీలక పరిణామం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. కానీ బాహుబలి అంతటి విజయం మాత్రం దక్కడం లేదు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో నిరాశపరిచింది. ఎమోషనల్ లవ్ స్టోరీగా వచ్చిన రాధేశ్యామ్ ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రభాస్ ఎంతో ఇష్టపడి ఓం రౌత్ దర్శకత్వంలో వందల కోట్ల బడ్జెట్ కేటాయించి చేసిన చిత్రం ఆదిపురుష్. 

26

ఇటీవల విడుదలైన ఆదిపురుష్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. పౌరాణిక చిత్రంగా రామాయణ గాధగా తెరకెక్కిన ఈ మూవీ అనేక విమర్శలు మూటగట్టుకుంది. దీనితో బిజినెస్ పరంగా కూడా నష్టాలు ఎదురయ్యాయి. పౌరాణిక చిత్రాన్ని ఓం రౌత్ కంప్లీట్ రాంగ్ వే లో ప్రజెంట్ చేయడం బెడిసికొట్టింది. 

36

దీనితో ప్రభాస్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నుంచి తదుపరి రాబోతున్న చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై నేషనల్ వైడ్ గా కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్ర బిజినెస్ రికార్డు స్థాయిలో జరగబోతోంది. ఇప్పటికే ఈ చిత్ర డిజిటల్ హక్కులని రూ 200 కోట్లు వెచ్చించి అమెజాన్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

46

ఇక తెలుగులో థియేట్రికల్ రైట్స్ విషయంలో నెవర్ బిఫోర్ బిజినెస్ జరగనుంది. అయితే ఆదిపురుష్ చిత్రంతో తన స్నేహితులు యువి క్రియేషన్స్ నిర్మాతలు వంశి, ప్రమోద్ లకు లబ్ది చేకూర్చాలని ప్రభాస్ ప్రయత్నించాడు. కానీ అది ఎలా బెడిసికొట్టిందో చూశాం. దీనితో ప్రభాస్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై బిజినెస్ వ్యవహారాల్లో తాను తలదూర్చకూడదని అనుకుంటున్నాడట. 

56

సలార్ బిజినెస్ విషయంలో ఎవరిని రికమండ్ చేయకూడదని అనుకుంటున్నాడట. ఆ వ్యవహారాలన్నీ నిర్మాతలకే వదిలేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సలార్ బిజినెస్ కి తన స్నేహితులని కూడా ప్రభాస్ దూరంగా ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. 

66

సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సలార్ చిత్ర థియేట్రికల్ రైట్స్ కోసం మైత్రి మూవీస్, గీతా ఆర్ట్స్ సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో  ప్రభాస్ కి జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories