టాలీవుడ్ సీనియర్ నటుడు వడ్డే నవీన్, జబర్దస్త్ కమెడియన్స్ ఆది, అమరదీప్, చిత్ర రాయ్, దీప్తి పిల్లి, నవ్యావ్మి, యాంకర్ వర్షిణి, యాంకర్ ధనుష్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు టాక్ వినిపిస్తోంది. గత కంటెస్టెంట్ల నుంచి శివ, అనిల్, మిత్రా, అరియానా గ్లోరీ కూడా రానున్నట్టు తెలుస్తోంది. అలాగే సాధారణమైన వ్యక్తులకు ఈ పాపులర్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఇవ్వనున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ కు హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆరో సీజన్ కు మాత్రం నాగార్జునకు బదులుగా స్టార్ హీరోయిన్ సమంత అయినా.. లేదంటే యాంకర్, నటి ఉదయభాణు హోస్ట్ గా రానున్నారని సమాచారం.