అయ్యో పాపం.. సమంత తరహాలో పూనమ్ కౌర్ కి అరుదైన వ్యాధి.. ఇది సోకితే ఏమవుతుందో తెలుసా..

First Published Dec 1, 2022, 3:27 PM IST

సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది పూనమ్ కౌర్. పూనమ్ కౌర్ ఎలాంటి విషయం గురించి అయినా తన అభిప్రాయాలు చెబుతుంది.

సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది పూనమ్ కౌర్. పూనమ్ కౌర్ ఎలాంటి విషయం గురించి అయినా తన అభిప్రాయాలు చెబుతుంది.. కానీ పరోక్షంగా మాత్రమే. అప్పట్లో పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ గా నిలిచాయి. 

తన కామెంట్స్ తో పూనమ్ కౌర్ రూమర్స్ కి కేంద్ర బిందువుగా మారింది. చాలా విషయాల్లో ఆమె క్లారిటీ మైంటైన్ చేయకుండా అందరిని తికమక పెట్టేది. దీనితో పూనమ్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా అభిమానుల్లో చర్చ జరిగేది. ఆమె ఆమె గురించి న్యూస్ వైరల్ అవుతూ వచ్చింది. 

తాజాగా పూనమ్ కౌర్ గురించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ప్రస్తుతం పూనమ్ కౌర్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటోంది అట. ఆమె ఫైబ్రో మయాల్జియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందని సమాచారం. దీనితో ప్రస్తుతం పూనమ్ కౌర్ కేరళలో ఆయుర్వేద వైద్యం తీసుకుంటోందట. ఈ వ్యాధి బారిన పడ్డవారికి చాలా ఇబ్బంది కరమైన లక్షణాలు ఉంటాయి. 

కండరాల నొప్పలు, శరీరం మొత్తం బిగుసుకుపోయినట్లు అనిపించడం, అలసట, నిద్రలేమి , జ్ఞాపక శక్తి క్షీణించడం లాంటి లక్షణాలు ఇబ్బంది పెడతాయి. ప్రస్తుతం పూనమ్ కౌర్ కూడా ఈ లక్షణాలని ఎదుర్కొంటోంది అట. 

స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇదే తరహాలో మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. సమంత ప్రస్తుతం కోలుకుంటోంది. పూనమ్ కౌర్ కూడా త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాంట్రవర్షియల్ కామెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే పూనమ్ కౌర్ ఈ రకంగా అనారోగ్యానికి గురికావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

పూనమ్ కౌర్ ప్రస్తుతం ఎలాంటి సినిమా అవకాశాలు అందుకోవడం లేదు. రీసెంట్ గా ఆమె రాహుల్ గాంధీతో కలసి పొలిటికల్ ర్యాలీలో పాల్గొన్న సంఘటన కూడా వైరల్ గా మారింది. పూనమ్ కౌర్ ఎలాంటి విషయం గురించి అయినా పరోక్షంగా కామెంట్స్ చేస్తూ ఏదో పరమార్థం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. 

click me!