కళ్లు జిగేల్‌మనిపించే అందాలతో బుట్టబొమ్మ విజువల్‌ ట్రీట్‌.. కలర్‌ ఫుల్‌ డ్రెస్సుల్లో ఫిదా చేస్తున్న పూజా

First Published Oct 2, 2022, 9:20 AM IST

పూజా హెగ్డే కలర్‌ఫుల్‌ విందు ఇచ్చింది. జిగేల్‌ రాణిని మించిన అందమైన ట్రెండీ దుస్తుల్లో మెరిసి ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. చాలా గ్యాప్‌తో నెటిజన్లకి కావాల్సిన సండే వీకెండ్‌ ట్రీట్‌ తీసుకొచ్చింది పూజా. 
 

బుట్టబొమ్మగా టాలీవుడ్‌లో పాపులారిటీని సొంతం చేసుకుంది పూజా హెగ్డే(Pooja Hegde). `అల వైకుంఠపురములో` చిత్రంతో ఆమె థైస్‌ చాలా పాపులర్‌. తాజాగా కొంత గ్యాప్‌తో ఇంటర్నెట్‌లో ఫైర్‌ అయ్యింది పూజా. తన అందాలతో మంటలు పుట్టించడం విశేషం. అది మామూలు కాదు, విభిన్న రకాల ట్రెండీ దుస్తులు ధరించి హోయలు పోయింది. 
 

`ఫరెవర్‌ ఇండియా` అనే కాస్ట్యూమ్, క్లాత్స్ బ్రాండ్ కి సంబంధించిన ప్రమోషన్‌లో భాగంగా ఇలా కలర్‌ఫుల్‌గా మెరిసింది పూజా హెగ్డే. ఇందులో విభిన్నరకాల ట్రెండీ వేర్స్ ధరించి హోయలు పోయింది. సోఫాలో కూర్చొని పరువాలు విందు చేసింది. హాట్‌ సిట్టింగ్‌లో మైండ్‌ బ్లాక్‌ చేసింది. థండర్‌ థైస్‌ చూపిస్తూ సెగలు పుట్టించింది. 

టాప్‌ అందాలతో మత్తెక్కించింది. కొంటె చూపులతో కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. విహరంతో కూడిన పోజులతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

పూజా హెగ్డే ఇప్పుడు సినిమా షూటింగ్‌లకు గ్యాప్‌ వచ్చింది. ఈ గ్యాప్‌లో వెకేషన్‌లో గడుపుతూనే మరోవైపు కమర్షియల్‌ బ్రాండ్‌ ప్రమోషన్‌ చేస్తూ సొమ్ము చేసుకుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు క్లాత్స్ బ్రాండ్‌ ప్రమోట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ లేపుతుంది. 
 

బుట్టబొమ్మ పూజా ఇప్పుడు తెలుగులో మహేష్‌బాబుతో సినిమా చేస్తుంది. ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. అక్టోబర్‌ మూడో వారంలో సెకండ్‌ షెడ్యూల్‌ని ప్రారంభించుకోబోతుంది. `మహర్షి` తర్వాత మహేష్‌తో చేస్తున్న చిత్రమిది. మరోవైపు `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో` చిత్రాల తర్వాత త్రివిక్రమ్‌తో చేస్తున్న చిత్రమిది. 
 

మరోవైపు పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేయాల్సి ఉంది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందనేదానిపై క్లారిటీ లేదు. ఇంకోవైపు విజయ్‌ దేవరకొండతో కలిసి నటిస్తున్న `జనగణమన` చిత్రం ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఓ రకంగా పూజా కెరీర్‌ స్థబ్దుగానూ మారిపోయింది. 
 

మొన్నటి వరకు టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ హీరోయిన్‌గా నిలిచింది. ఆమె సినిమా చేస్తే చాలు అది హిట్టే అనే టాక్‌ వినిపించింది. గోల్డెన్‌ లెగ్‌గానూ పిలుచుకున్నారు. కానీ ఇటీవల ఆమె సినిమాలు మూడు వరుసగా పరాజయం చెందాయి. దీంతో ఆ క్రేజ్‌ కొద్దిగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఉన్న సినిమాల్లో బిజీ కారణంగా ఆమె విజయ్‌ తో `వారసుడు` సినిమాని వదులుకున్న విషయం తెలిసిందే. 
 

మరోవైపు హిందీలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది పూజా. అక్కడ సల్మాన్‌ ఖాన్‌తో ఓ సినిమా చేస్తుంది. ఇందులో వెంకటేష్‌ కీలక పాత్రలో నటిస్తుంది. వెంకీకి చెల్లిగా పూజా కనిపించబోతుందని సమాచారం. 
 

పూజా హెగ్డే కలర్‌ఫుల్‌ విందు ఇచ్చింది. జిగేల్‌ రాణిని మించిన అందమైన ట్రెండీ దుస్తుల్లో మెరిసి ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. చాలా గ్యాప్‌తో నెటిజన్లకి కావాల్సిన సండే వీకెండ్‌ ట్రీట్‌ తీసుకొచ్చింది పూజా. 

పూజా హెగ్డే కలర్‌ఫుల్‌ విందు ఇచ్చింది. జిగేల్‌ రాణిని మించిన అందమైన ట్రెండీ దుస్తుల్లో మెరిసి ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. చాలా గ్యాప్‌తో నెటిజన్లకి కావాల్సిన సండే వీకెండ్‌ ట్రీట్‌ తీసుకొచ్చింది పూజా. 

click me!