ఫొటోలు: క్రిస్మస్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ..చరణ్,చిరు,బన్ని..ఇంకా
First Published Dec 26, 2020, 9:08 AM ISTదేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ ముందు రోజు అర్ధరాత్రి నుంచే ఈ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇందుకు చర్చిలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. కొత్త సంవత్సరానికి ఆరు రోజుల ముందు వచ్చే ఈ పండుగ కోసం ప్రపంచంలోని క్రైస్తవులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. క్రైస్తవులు మాత్రమే కాకుండా హిందువులు కూడా ఈ పండుగను జరుపుకోవడం చెప్పుకోదగ్గ విషయం. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు సినీ తారలు శుభాకాంక్షలు తెలిపారు. తమ ఇళ్లల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీలతో ఫొటోలు దిగి.. నెట్టింట్లో షేర్ చేశారు. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలను నింపాలని, అంతా శుభమే జరగాలని వారు కోరుకున్నారు. చిరంజీవి, మహేశ్బాబు దంపతులు, సమంత, అనన్యపాండే, సల్మాన్ఖాన్, కరీనాకపూర్.. ఇలా సెలబ్రిటీలు షేర్ చేసిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మెగా ఫ్యామిలీ అంతా ఈ వేడుకను ఘనంగా జరుపుకుంది ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి..!