పవన్‌కి `ఆర్‌ ఎక్స్ 100` బ్యూటీ స్పెషల్‌ గిఫ్ట్

First Published Sep 2, 2020, 8:07 PM IST

`ఆర్‌ ఎక్స్ 100` హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌..పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌పై తనకున్న ప్రేమ, అభిమానాన్ని చాటుకుంది. ఆయన బర్త్ డేని పురస్కరించుకుని బుధవారం ఓ స్పెషల్‌ గిఫ్ట్ ఇచ్చింది. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి పవన్‌కి కానుకగా అందించింది. 

రాజ్యసభ ఎంసీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కి విశేష స్పందన లభిస్తుంది. ఇందులో సెలబ్రిటీలు భాగమై విజయవంతం చేశారు. అందులో భాగంగా తాజాగా బుధవారం `ఆర్‌ ఎక్స్ 100` ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ బాలానగర్‌లోని తాను నివాసం ఉండే ప్రాంతంలో మొక్కలు నాటింది.
undefined
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొక్కలు నాటడం నాకు చాలా ఇష్టం. అందుకే ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని స్వతహాగా స్వీకరించి మొక్కలు నాటాను. మారుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని రక్షించాలని కోరింది.
undefined
ఈ రోజు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు కావడంతో, ఆయనకు ఇలా మొక్కలు నాటి బర్త్ డే విశెష్‌ తెలియజేయడం చాలా ఆనందంగా ఉందని పాయల్‌ పేర్కొంది.
undefined
ఈ సందర్భంగా రవితేజ, సౌరబ్‌, కరణ్‌, ప్రజ్ఞా జైస్వాల్‌లకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని విసిరింది. తమ ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటాలని తెలిపింది.
undefined
ఈ ఏడాది `డిస్కోరాజా`లో మెరిసిన ఈ హాట్‌ బ్యూటీ `5డబ్ల్యూ`, `ఏంజెల్‌`, `నరేంద్ర` చిత్రాల్లో నటిస్తుంది. `ఆర్‌ ఎక్స్ 100` తర్వాత ఈ భామకి ఆ స్థాయి హిట్‌ ఇంకా రాకపోవడం గమనార్హం.
undefined
click me!