చిరంజీవి సపోర్ట్ తో సోషల్ మీడియాలోకి పవన్ భార్య.. 1800 కోట్ల ఆస్తి వదిలేసి ఇండియాకి ఎందుకు వచ్చిందో తెలుసా ?

Published : Mar 25, 2026, 06:37 PM IST

పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె తన ఫస్ట్ పోస్ట్ లో చిరంజీవి గురించి ప్రస్తావించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
పవన్ కళ్యాణ్ సతీమణి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అన్నా కొణిదెల పేరుతో ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేశారు. దీనితో ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో టాప్ లోకి దూసుకెళ్లారు. అన్నా కొణిదెల ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ వైరల్ గా మారింది.

25
సోషల్ మీడియాలోకి అన్నా కొణిదెల

తన భర్త పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటోని అన్నా కొణిదెల ఇన్స్టా లో షేర్ చేశారు. ఈ ఫోటోకి ఆమె పెట్టిన కామెంట్ కూడా ఆసక్తికరంగా ఉంది. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నా, ఇది మంచి సమయం అనిపించింది. చిరంజీవి గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో ఈ కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ తో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న అన్నా కొణిదెల ఫోటో ఆకట్టుకుంటోంది.

35
వెల్కమ్ చెప్పిన చిరంజీవి

పవన్ కళ్యాణ్.. తన సతీమణికి స్వాగతం పలుకుతూ పోస్ట్ చేశారు. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి కూడా అన్నా కొణిదెలకి వెల్ కమ్ చెప్పారు. అన్నా కొణిదెల ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారడంతో ఆమె గురించి ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి.

45
పవన్ తో పరిచయం అలా..

అన్నా లెజినోవా రష్యాకి చెందిన మోడల్. సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ ఇండియాకి వచ్చారు. ఈ క్రమంలో తీన్ మార్ మూవీలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించారు. రేణు దేశాయ్ తో విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాని వివాహం చేసుకున్నారు. 2013లో వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.

55
అన్నా కొణిదెల ఆస్తి వివరాలు

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం అన్నా లెజినోవాకి రష్యాలో, సింగపూర్ లాంటి దేశాల్లో 1800 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సింగపూర్ లో ఆమెకు హోటల్ బిజినెస్ ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. ఆమెది ధనిక కుటుంబం అన్నట్లు ప్రచారం సాగుతోంది. అన్ని వందల కోట్ల ఆస్తి ఉన్న అన్నా లెజినోవా ఇండియాకి ఎందుకు వచ్చింది ? సినిమాల్లో ఆఫర్స్ కోసమే వచ్చిందా ? అంటూ నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories