పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి అవుతున్న థియేట్రకిల్ బిజినెస్ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏడాది గ్యాప్లోనే మూడు సినిమాలతో వస్తున్నారు. ఆయన నటించిన `హరి హర వీరమల్లు` మూవీ జులైలో విడుదలయ్యింది. ఆ తర్వాత రెండు నెలల గ్యాప్తోనే సెప్టెంబర్లో `ఓజీ` మూవీ విడుదలయ్యింది. ఇందులో `హరి హర వీరమల్లు` మూవీ డిజప్పాయింట్ చేసింది. `ఓజీ` బాక్సాఫీసు ని షేక్ చేసింది.
25
గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్తో పవన్
త్వరలో పవన్ కళ్యాణ్ `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రంతో రాబోతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. `గబ్బర్ సింగ్` తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మూవీ రాలేదు. ఇన్నాళ్లకి ఇప్పుడు `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మార్క్ పొలిటికల్ డైలాగులు, యాక్షన్ సీన్లు ఉండబోతున్నాయని టీజర్, గ్లింప్స్ ని చూసినప్పుడే అర్థమయ్యింది. ఇది పక్కా కమర్షియల్ మూవీ ఇది. అభిమానులు బాగా ఎంజాయ్ చేసేలా ఉంటుందని టాక్.
35
మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్
ఇటీవల విడుదల చేసిన సాంగ్ కి విశేషమైన స్పందన లభించింది. ఈ మూవీని మార్చి 26న విడుదల చేయబోతున్నారు. దీంతో ప్రమోషన్స్ ని షురూ చేసింది. వరుసగా పాటలను, వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ ఎంత అనేది బయటకు వచ్చింది. ఈ చిత్రానికి భారీగానే మార్కెట్ జరుగుతుందని తెలుస్తోంది.
`ఉస్తాద్ భగత్ సింగ్` మూవీకి థియేట్రికల్ రైట్స్ రూ.140కోట్లకుపైగా అమ్ముతున్నట్టు సమాచారం. ఇది `హరి హర వీరమల్లు` మూవీ కంటే ఎక్కువగా ఉంటుంది. అదే మసయంలో `ఓజీ` కంటే తక్కువగా అవుతుందట. `హరి హర వీరమల్లు` మూవీ కంటె ఎక్కువగానే పలుకుతుంది. `హరి హర వీరమల్లు` మూవీకి రూ.127కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగితే, ఓజీకి రూ.170కోట్లకు అమ్ముడు పోయిందని తెలుస్తోంది. ఇప్పుడు `ఉస్తాద్` మూవీకి `ఓజీ` కంటే తక్కువ బిజినెస్ జరుగుతుందని తెలుస్తోంది.
55
మీనాక్షి చౌదరీ స్పెషల్ సాంగ్
పవన్ కళ్యాణ్ హీరోగా, శ్రీలీలా హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరీ స్పెషల్ సాంగ్ చేయబోతుందట. రాశీఖన్న్నా మరో హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మిస్తున్నారు. చాలా గ్రాండ్గా దీన్ని విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.