బాలీవుడ్ మీడియా కథనాలు ప్రకారం ప్రభాస్ ఆదిపురుష్, స్పిరిట్ చిత్రాల కోసం ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నారట. దీనితో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ రెకార్డులకు ఎక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో వంద కోట్ల వరకు తీసుకుంటున్న హీరోలుగా రజినీకాంత్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ఉన్నారు.