ఇక తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు తేజు కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక పిఠాపురం, గోపాలపురం లాంటి ప్రాంతాల్లో సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, జనసేన కార్యకర్తలు పూజలు చేస్తున్నారు. ఇక తేజుకు చికిత్స కొనసాగుతోంది. తేజు ఆరోగ్యం మెరుగవుతోంది అని చెప్పిన వైద్యులు.. మరో 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచుతాం అని ప్రకటించారు.