తెలుగు ప్రేక్షకులు, మాస్ మహరాజా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ గా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. రవితేజ తొలి పాన్ ఇండియా చిత్రమిది. అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.